తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాక్​లో బాంబు దాడి.. 12 మంది మృతి - ఇరాక్​

ఇరాక్​ కర్బాలా ప్రాంతంలో దారుణం జరిగింది. బస్సులో బాంబు పేలి 12 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇరాక్​లో బాంబు దాడి.. 12 మంది మృతి

By

Published : Sep 21, 2019, 9:55 AM IST

Updated : Oct 1, 2019, 10:22 AM IST

ఇరాక్​లో బాంబు దాడి.. 12 మంది మృతి

ఇరాక్​ కర్బాలా ప్రాంతంలో భారీ పెలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

దక్షిణ కర్బాలలోని అల్​-హిల్లా నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక తనిఖీ కేంద్ర వద్ద బస్సులో పేలుడు సంభవించింది. పేలుడుకు ముందు, ఓ ప్రయాణికుడు బస్సు నుంచి దిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. అతను పేలుడు పదార్థాలతో ఉన్న బ్యాగును బస్సులోని ఓ సీటు కింద ఉంచి రిమోట్​ సాయంతో పేల్చినట్లు అనుమానిస్తున్నారు.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ 2017 నుంచి ఇరాక్​లోని పలు ప్రాంతాల్లో స్లీపర్​ సెల్స్​ ద్వారా దాడులను చేయిస్తుందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:పర్యావరణ పరిరక్షణకు ఏకమైన ప్రపంచం

Last Updated : Oct 1, 2019, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details