'ఫొని' తుపాను కారణంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తీర ప్రాంతంలోని 5 లక్షల మందిని ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భారత్లో ఫొని సృష్టించిన విధ్వంసాన్ని చూసిన బంగ్లాదేశ్ చిగురుటాకులా వణుకుతుంది. భారత వాతావరణ విభాగం ఫొనిని 'అత్యంత ప్రమాదకర తుపాను'గా పేర్కొంది.
ఖుల్నా ప్రాంతం ద్వారా బంగ్లాదేశ్లో శనివారం సాయంత్రం కల్లా ప్రవేశించనుంది ఫొని ప్రచండ తుపాను. తీరాన్ని తాకే సమయంలో బలమైన గాలులు, కుండపోత వర్షంతో విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు ఆ దేశ వాతావరణ విభాగం హెచ్చరించింది.