తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆర్మేనియా-అజర్​బైజాన్​ మధ్య మళ్లీ 'వార్​'

ఆర్మేనియా-అజర్​బైజాన్​ల​ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వివాదాస్పద నాగోర్నో-కరాబాఖ్‌ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

By

Published : Oct 17, 2020, 7:01 PM IST

Updated : Oct 17, 2020, 7:22 PM IST

Azerbaijan says 13 civilians dead in Armenian missile attack
ఆర్మేనియా-అజర్​బైజాన్​ మధ్య మళ్లీ 'వార్​'

వివాదాస్పద నాగోర్నో-కరాబాఖ్‌ ప్రాంతం గురించి అజర్‌బైజాన్‌, ఆర్మేనియా దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఆర్మేనియా నిర్వహించిన క్షిపణి దాడిలో.. 13 మంది తమ పౌరులు మరణించారని అజర్​బైజాన్​ ఆరోపించింది. సుమారు 50 మంది గాయపడినట్టు పేర్కొంది. గాంజాలో శుక్రవారం జరిగిన ఈ దాడిలో 20 నివాస భవనాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు అజర్‌బైజాన్‌ అధికారులు. అయితే ఈ ఆరోపణలను ఆర్మేనియా ఖండించింది.

ఆర్మేనియా క్షిపణి దాడులను.. యుద్ధ నేరంగా పరిగణించారు అజర్​బైజాన్​ అధ్యక్షుడు ఇహమ్​ అలియోవ్​. ఈ దాడికి యుద్ధరంగంలోనే బదులిస్తామని ఆర్మేనియాను హెచ్చరించారు.

నాగోర్నో-కరాబాఖ్‌ ప్రాంతం అజర్​బైజాన్​లో ఉన్నప్పటికీ.. నియంత్రణ మాత్రం ఆర్మేనియా సంప్రదాయ వాదుల చేతుల్లో ఉంది.

Last Updated : Oct 17, 2020, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details