మూడో దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు నేపాల్ మీదగా ప్రయాణించడం మానుకోవాలని అక్కడి ఇండియన్ ఎంబసీ సూచించింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విదేశీయులు తమ దేశాన్ని రవాణా పాయింట్గా వినియోగించుకోవడంపై నేపాల్ నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయ రాయబార కార్యాలయం తాజా ప్రకటన చేసింది.
ప్రత్యేకంగా నేపాల్కు వెళ్లే ప్రయాణికులపై ఎలాంటి ఆంక్షలు ఉండవని నేపాల్లోని భారతీయ ఎంబసీ తెలిపింది. ఇప్పటికే నేపాల్ చేరుకున్న భారతీయుల ప్రయాణాల కోసం నేపాల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.