తెలంగాణ

telangana

ETV Bharat / international

అఫ్గానిస్థాన్​లో పేలుడు.. 12 మంది మృతి!

అఫ్గానిస్థాన్​లో బాంబు పేలుడు సంభవించింది​. ఘాంజీ నగరంలో జరిగిన ఈ దాడిలో కనీసం 12 మంది మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మరో 179 మంది స్థానికులకు గాయాలయ్యాయి. ఈ ఘాతుకానికి తామే ఒడిగట్టినట్లు పేర్కొంది తాలిబన్ ఉగ్రసంస్థ​.

By

Published : Jul 7, 2019, 4:10 PM IST

అఫ్గానిస్థాన్​లో పేలుడు.. 12 మంది మృతి!

తూర్పు అఫ్గానిస్థాన్​లో దాడికి తెగించింది తాలిబన్​ ఉగ్రసంస్థ. ఘాంజీ నగరంలో భారీ కారు బాంబు పేలుడుకు పాల్పడింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మరో 179 మంది స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు తామే చేసినట్లు తాలిబన్ ప్రకటించుకుంది.

18 ఏళ్లుగా అఫ్గానిస్థాన్​ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న అమెరికా దళాలు అఫ్గాన్​ను వదిలి వెళ్లాలనే అంశంపై డోహాలో చర్చలు సాగుతున్నాయి. అమెరికా, అఫ్గానిస్థాన్​తో పాటు తాలిబన్​ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ తరుణంలో కారుబాంబు దాడి పరిణామాలు ఎలా ఉంటాయో అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి.

ఇదీ చూడండి: హైదరాబాద్​ వర్సిటీకి ర్యాంక్​ మిస్సైంది అందుకే...

ABOUT THE AUTHOR

...view details