తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాలో మలద్వార స్వాబ్​ పరీక్షలు - చైనా కరోనా పరీక్ష విధానం

చైనాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. కొందరు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని భయాందోళనకు గురవుతున్నారు. విదేశాల నుంచి వచ్చినవారికి, వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల ప్రజలకు మలద్వారం వద్ద కూడా స్వాబ్‌ పరీక్షలు నిర్వహించాలని ఆ దేశం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. అయితే.. ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Anal swab tests the latest embarrassment emerging from Covid-19 crisis
చైనాలో మలద్వార స్వాబ్​ పరీక్షలు

By

Published : Jan 29, 2021, 7:24 AM IST

చైనాలో కొవిడ్​-19 కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి పౌరులను ఓ కొత్త అంశం బెంబేలెత్తిస్తోంది. వైరస్​ నిర్ధరణకు ఇబ్బందికరమైన రీతిలో మలద్వార స్వాబ్​ పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుని మలద్వార స్వాబ్​ పరీక్షలను ఇటీవల ప్రారంభించింది చైనా. విదేశాల నుంచి వచ్చేవారు, అధిక రిస్కు ఉన్న ప్రాంతాల్లో నివసించేవారిపై దృష్టిపెట్టినట్టు చైనా అధికారిక పత్రిక 'గ్లోబల్​ టైమ్స్​' పేర్కొంది.

ఈ పరీక్ష ద్వారా కరోనా వైరస్​ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించడానికి వీలవుతుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఓ మహిళ.. 'షియాహోంగ్షు' అనే సామాజిక మాధ్యమంలో ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన తనకు ముక్కు, గొంతు స్వాబ్​లు, రక్త, లాలాజల పరీక్షలతోపాటు మలద్వార స్వాబ్​ కూడా చేస్తామని అధికారులు చెప్పినప్పుడు తాను తీవ్ర మానసిక క్షోభకు గురైనట్టు చెప్పారామె. ఈ చర్య జుగుప్సాకరంగా ఉందని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:'మాస్క్‌పై మాస్క్‌తో ప్రయోజనమెక్కువ'

ABOUT THE AUTHOR

...view details