తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2019, 8:55 PM IST

ETV Bharat / international

తాబేళ్లు మెచ్చే నివాసం..నేడు కాలుష్యానికి ఆవాసం

సీషెల్స్​ దేశంలోని అల్డాబ్రా ద్వీపంలో గుడ్లు పెట్టడానికి  పచ్చ తాబేళ్లు వందల మైళ్లు ప్రయాణిస్తాయి. కానీ వాటికన్నా ముందే ప్లాస్టిక్​ వ్యర్థాలు ఈ తీరానికి చేరుతున్నాయి. హిందూ సముద్రంలో ఈ అల్డాబ్రా తీరం తాబేళ్ల వృద్ధికి ఓ ముఖ్య ప్రదేశం. ప్రస్తుతం ఈ దీవి ప్లాస్టిక్​ భూతానికి నిలయమైంది.

తాబేళ్లు

తాబేళ్లు మెచ్చే నివాసం..నేడు కాలుష్యానికి ఆవాసం
సీషెల్స్​ దేశంలోని​ అల్డాబ్రా దీవి వన్యప్రాణులకు ఓ సురక్షిత ప్రదేశం. అరుదైన పచ్చ తాబేళ్లు వేల మైళ్లు ప్రయాణించి ఈ దీవికి చేరతాయి. ఇక్కడే గుడ్లు పెట్టి తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి. కానీ కొద్ది కాలంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ప్రస్తతం 'యునెస్కో వరల్డ్​ హెరిటేజ్​ ' ప్రదేశాల్లో ఎటు చూసినా ప్లాస్టిక్​ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. 'అల్డాబ్రా క్లీన్​అప్​ ప్రాజెక్టు' పేరుతో పర్యావరణ పరిరక్షకులు ప్లాస్టిక్​ వ్యర్థాలను శుభ్రం చేస్తున్నారు. ఎంత శుభ్రం చేసినా నిర్వాహకులకు ఇది తలకి మించిన భారంగానే ఉంది.

ప్రపంచలోనే అతి పెద్ద పగడాల దీవులలో ఒకటైన అల్డాబ్రా ప్రస్తుతం ప్లాస్టిక్​ భూతం కోరల్లో చిక్కుకుంది. ఇక్కడి వన్య ప్రాణిని ప్రమాదంలోకి నెట్టేస్తోంది.

'అల్డాబ్రా చాలా సురక్షిత ప్రదేశం. కానీ ఈ ప్రదేశాన్ని ఎంత వరకు కాపాడగలం..? చాలా మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ వాతావరణ మార్పులు, ప్లాస్టిక్​ కాలుష్యం వంటివి ఈ ప్రదేశంపై ప్రభావం చూపిస్తున్నాయి."
-జెరిమీ రగుయేన్, పారిశుద్ధ్య నిర్వాహకుడు

అల్డాబ్రా తీరంలో దాదాపు 1000 టన్నుల మేర ప్లాస్టిక్​ వ్యర్థాలున్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. బాటిల్స్​ నుంచి రోజువారీ వాడే ప్లాస్టిక్​ సామాన్ల వరకు ఇందులో ఉన్నాయి.

హిందూ మహా సముద్ర తీరం వెంబడి సుమారు 250 కోట్ల మంది జీవిస్తున్నారు. వీరిలో తూర్పు ఆఫ్రికా నుంచి అరేబియన్​ ద్వీపకల్పం, భారత్ సహా ఆగ్నేయ ఆసియా దేశాల ప్రజలు హిందూ సముద్ర తీరాల్లో నివసిస్తున్నారు. వీరి వల్ల కలుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. ఇండోనేసియా నుంచీ ప్లాస్టిక్​ వ్యర్థాలు వేల మైళ్లు ప్రయాణించి ఈ తీరానికి చేరుతున్నాయి.

అల్డాబ్రాలోని పెద్ద తాబేళ్లు సైతం ఈ ప్లాస్టిక్​ వ్యర్థాల ధాటికి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటి వరకు 'క్లీన్అప్​ ప్రాజెక్టు' నిర్వాహకులు 22 టన్నుల ప్లాస్టిక్​ వ్యర్థాలను శుభ్రం చేశారు.

పరిశోధకులు ఏడు వారాల పాటు సముద్రంలో 6560 అడుగుల లోతు వరకు సెన్సార్లు ఏర్పాటు చేసి జీవ మనుగడపై దృష్టి సారించారు.

ABOUT THE AUTHOR

...view details