తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రక్కు, వ్యాన్​ ఢీ- 14 మంది మృతి - దక్షిణ జాబుల్​లో యాక్సిడెంట్​

అఫ్గానిస్థాన్​లోని దక్షిణ జాబుల్​ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

accident
ట్రక్కు, వ్యాన్​ ఢీ

By

Published : Apr 23, 2021, 8:41 PM IST

అఫ్గానిస్థాన్​లోని దక్షిణ జాబుల్​ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కందహార్​, కాబుల్ మధ్య రహదారిపై ఈ ఘటన జరిగింది.

రంజాన్ సెలవుల​ సందర్భంగా.. దక్షిణ హెల్మాండ్​ రాష్ట్రం నుంచి కార్మికులతో గురువారం బయల్దేరిన మినీవ్యాన్​.. దక్షిణ జాబుల్​లో ట్రక్కును ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన సమయంలో.. డ్రైవర్​ సహా 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:భారత్​కు టీకా సాయంలో పంతం వీడని అమెరికా!

ఇదీ చూడండి:ఎవరెస్టు పర్వతాన్నీ వదలని కరోనా!

ABOUT THE AUTHOR

...view details