అఫ్గానిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని కాబుల్లో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 70మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలు తెలియలేదని అధికారులు తెలిపారు.
రెండు బస్సులు ఢీ- ఏడుగురు మృతి - అఫ్గానిస్థాన్ లో ప్రమాదం
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 70మందికి పైగా గాయపడ్డారు.

ప్రమాదం
ఇదే రహదారిపై గత వారం రోడ్డు ప్రమాదం జరిగి 14మంది మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు.
ఇదీ చదవండి:కుప్పకూలిన విమానం.. నలుగురు మృతి