తెలంగాణ

telangana

ETV Bharat / international

సుడిగుండాలకు చైనాలో ఏడుగురు బలి - china tornado news

చైనాలో శుక్రవారం రాత్రి ఏర్పడ్డ సుడిగుండాలకు ఏడుగురి ప్రాణాలు కోల్పోయారు. వుహాన్, షెంజీ ప్రాంతాల్లో సంభవించిన ఈ టోర్నడోలకు 200 మందికిపైగా గాయపడ్డట్టు సమాచారం.

china tornadoes
సుడిగుండాలకు చైనాలో ఏడుగురు బలి

By

Published : May 15, 2021, 9:45 AM IST

Updated : May 15, 2021, 2:28 PM IST

చైనాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం సంభవించిన సుడిగుండాల కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మధ్య, తూర్పు చైనా ప్రాంతాల్లో వచ్చిన ఈ తీవ్రమైన తుపానులకు 200 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం.

ధ్వంసమైన నిర్మాణాలు
సహాయక చర్యలు

వుహాన్​లో టోర్నడో ప్రభావానికి ఆరు మంది మృతిచెందగా.. 218 మంది గాయపడ్డారు. గంటకు 86 కిలోమీటర్ల వేగంతో వస్తున్న టోర్నడో రాత్రి 8.40 గంటలకు ఆ ప్రాంతాన్ని తాకినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనేక చెట్లు, నిర్మాణ స్థలాల్లోని షెడ్లు నేలమట్టం అయ్యాయి.

ఘటనాప్రాంతంలో సహాయక చర్యలు
భవనాలు ధ్వంసం

వుహాన్​లో టోర్నడో విధ్వంసానికి 90 నిమిషాల ముందు షెంజీ పట్టణంలో మరో టోర్నడో సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో విద్యుత్​ కేంద్రాలు, పలు ఫ్యాక్టరీలు ధ్వంసమయ్యాయి.

సుడిగుండాల ఎఫెక్ట్
శిథిలాల్లో ఇరుక్కుపోయిన వాహనం

ఇదీ చదవండి :వాటిపై ధరలు తగ్గించాలని చైనాకు భారత్​ విజ్ఞప్తి

Last Updated : May 15, 2021, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details