తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా విమాన ప్రమాదంలో 41 మంది మృతి

రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో 41 మంది మృతి చెందారు. సాంకేతిక కారణాల వల్ల సుఖోయ్ సూపర్​ జెట్​-100ను  అత్యవసర ల్యాండింగ్​ చేశారు. ఈ సమయంలో ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగాయి. విమానంలో 73 మంది ప్రయాణికులున్నారు.

By

Published : May 6, 2019, 6:33 AM IST

Updated : May 6, 2019, 9:49 AM IST

రష్యా విమాన ప్రమాదంలో 41 మంది మృతి

రష్యాలో ఓ విమానంలో అగ్ని ప్రమాదం జరిగింది. మాస్కో విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్​ చేస్తుండగా విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో 78 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. ఈ ఘటనలో 41 మంది మృతి చెందారు. 37 మంది ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు.

రష్యాకు చెందిన సుఖోయ్​ సూపర్​జెట్​-100 విమానం మాస్కో నుంచి మర్మేన్​స్క్​ నగరానికి బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక కారణాల వల్ల అత్యవసర ల్యాండింగ్​ చేశారు పైలట్లు. విమానం రన్​వేను తాకిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటం వల్ల దట్టమైన పొగ అలుముకుంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 2011 నుంచి ఈ విమానాన్ని ప్రయాణ సేవలకు వినియోగిస్తున్నారు.

Last Updated : May 6, 2019, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details