అఫ్గానిస్థాన్లో దారుణం జరిగింది. పశ్చిమ ఫరా రాష్ట్రంలోని కాందహార్-హెరాత్ జాతీయ రహదారిపై బుధవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
అఫ్గాన్లో బాంబు పేలుడు.. 34 మంది మృతి - asualt
అఫ్గానిస్థాన్ పశ్చిమ ఫరా రాష్ట్రంలో బాంబు పేలుడు సంభవించింది. కాందహార్-హెరాత్ జాతీయ రహదారిపై జరిగిన ఈ విధ్వంసంలో 34 మంది సామాన్య ప్రజలు బలయ్యారు. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉన్నారు. ఈ దాడి వెనుక తాలిబన్ ఉగ్రసంస్థ హస్తం ఉందని అధికారులు భావిస్తున్నారు.
![అఫ్గాన్లో బాంబు పేలుడు.. 34 మంది మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3996922-1004-3996922-1564556973873.jpg)
అఫ్గాన్లో బాంబు పేలుడు.. 34 మంది మృతి
భద్రతా దళాలు, పోలీసులే లక్ష్యంగా చేసిన దాడిలో సామాన్యులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. మరణించినవారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఈ దాడికి ఇప్పటివరకూ ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు. తాలిబన్ ఉగ్రవాద సంస్థే కారణమై ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.
Last Updated : Jul 31, 2019, 1:40 PM IST