తెలంగాణ

telangana

ETV Bharat / international

అఫ్గాన్​లో బాంబు పేలుడు.. 34 మంది మృతి - asualt

అఫ్గానిస్థాన్​ పశ్చిమ ఫరా రాష్ట్రంలో బాంబు పేలుడు సంభవించింది. కాందహార్​-హెరాత్​ జాతీయ రహదారిపై జరిగిన ఈ విధ్వంసంలో 34 మంది సామాన్య ప్రజలు బలయ్యారు. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉన్నారు. ఈ దాడి వెనుక తాలిబన్​ ఉగ్రసంస్థ హస్తం ఉందని అధికారులు భావిస్తున్నారు.

అఫ్గాన్​లో బాంబు పేలుడు.. 34 మంది మృతి

By

Published : Jul 31, 2019, 12:48 PM IST

Updated : Jul 31, 2019, 1:40 PM IST

అఫ్గానిస్థాన్​లో దారుణం జరిగింది. పశ్చిమ ఫరా రాష్ట్రంలోని కాందహార్-​హెరాత్​ జాతీయ రహదారిపై బుధవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

భద్రతా దళాలు, పోలీసులే లక్ష్యంగా చేసిన దాడిలో సామాన్యులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. మరణించినవారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఈ దాడికి ఇప్పటివరకూ ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు. తాలిబన్ ఉగ్రవాద సంస్థే కారణమై ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.

Last Updated : Jul 31, 2019, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details