తాలిబన్ల దాడులతో అట్టుడుకుతోంది అఫ్గానిస్థాన్. గత వారంలో తాలిబన్ దాడుల్లో సుమారు 291 మంది సైనికులు మృతి చెందగా... 550 మందికి గాయలయ్యాయని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. అఫ్గాన్పై 2001లో అమెరికా దాడి తర్వాత అత్యధికంగా భద్రత బలగాలు మరణించడం ఇదే తొలిసారి అని తెలిపింది. తాలిబన్లు, అమెరికా మధ్య జరిగిన శాంతి ఒప్పందం ప్రకారం... అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్లు చర్చలకు సిద్ధమవుతున్న క్రమంలో హింస చెలరేగడం చర్చనీయాంశమైంది.
"దేశంలోని మొత్తం 34 రాష్ట్రాలు ఉండగా... 32 రాష్ట్రాల్లో 422 సార్లు తాలిబన్లు గతవారంలో దాడి చేశారు. ఈ దాడుల్లో 291 మంది అఫ్గాన్ జాతీయ రక్షణ, భద్రత దళాల (ఏఎన్డీఎస్ఎఫ్) సభ్యులు మరణించగా... 550 మంది క్షతగాత్రులయ్యారు."
-జావీద్ ఫైజల్, జాతీయ భద్రత మండలి (ఎన్ఎస్సీ) ప్రతినిధి