తెలంగాణ

telangana

ETV Bharat / international

బొగ్గుగని ప్రమాదంలో 23కు చేరిన మృతుల సంఖ్య - కార్బన్​ మోనాక్సైడ్

చైనా యోంగ్​ చువాన్​ జిల్లా బొగ్గు గని ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు చేరింది. మొత్తం 24మంది గనిలో చిక్కుకున్న ఘటనలో సహాయక సిబ్బంది ఒకరిని రక్షించారు.

23 killed, 1 rescued in China's coal mine accident
బొగ్గుగనిలో చిక్కుకొని 23మంది మృతి

By

Published : Dec 6, 2020, 9:15 AM IST

చైనా యోంగ్​ చువాన్​ జిల్లాలోని డయాచువాన్​ బొగ్గుగనిలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు చేరినట్లు అధికారులు తెలిపారు. చెత్తను తొలగించే క్రమంలో 24మంది కార్మికులు ప్రమాదవశాత్తు గనిలో చిక్కుకున్నారు. వీరిలో శనివారం 18 మంది మృతించెందారు. ఒకరిని సహాయక సిబ్బంది రక్షించారు.

కార్బన్​ మోనాక్సైడ్ వాయువు అధికంగా విడుదల అవ్వటం కారణంగా కార్మికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.

ఇదీ చదవండి:గనిలో చిక్కుకుని 18మంది మైనర్లు మృతి​

ABOUT THE AUTHOR

...view details