తెలంగాణ

telangana

By

Published : Oct 23, 2020, 5:48 PM IST

ETV Bharat / international

తాలిబన్​ దాడుల్లో 20 మంది​ సైనికులు మృతి

అఫ్గాన్​లో తాలిబన్​లు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా సిబ్బందే లక్ష్యంగా దాడులకు పాల్పడి 20 మందిని బలిగొన్నారు.

20 Afghan security personnel killed in Taliban attack
తాలిబన్​ దాడుల్లో 20మంది అఫ్గాన్​ సైనికులు మృతి

అఫ్గానిస్థాన్​పై తాలిబన్​లు చేసిన దాడుల్లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. నిమ్రోజ్​ రాష్ట్రంలోని ఖాష్రోద్​ జిల్లాలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు వెల్లడించారు.

ఈ ఘటనలో మరో ఆరుగురు సిబ్బందిని.. తాలిబన్​లు తమ అధీనంలోకి తీసుకున్నారని నిమ్రోజ్​ గవర్నర్​ జలీల్​ అహ్మద్​ వాటన్​దస్త్​ తెలిపారు. అయితే.. ఈ అంశంపై ఆ దేశ రక్షణ శాఖ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

దోహాలో తాలిబన్​లతో శాంతికోసం చర్చలు కొనసాగుతున్న తరుణంలోనే ఇలాంటి హింసాత్మక దాడులు జరగడం గమనార్హం.

తాజా దాడితో 24 గంటల వ్యవధిలోనే 24 రాష్ట్రాలపై తాలిబన్​లు దాడిచేశారని అఫ్గాన్​ ప్రభుత్వం పేర్కొంది.

ఇదీ చదవండి:ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్​కు గిన్నిస్​ రికార్డు

ABOUT THE AUTHOR

...view details