తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​లోని మసీదులో భారీ పేలుడు..16 మంది మృతి - pak army chief General Qamar Bajwa

పాకిస్థాన్​లోని​ బలూచిస్థాన్​ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. ఓ మసీదులో ప్రార్థనలు చేసేవారే లక్ష్యంగా బాంబు దాడికి పాల్పడ్డారు ముష్కరులు. ఈ దుర్ఘటనలో సీనియర్​ పోలీసు అధికారి సహా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

15 killed, 20 injured in blast at mosque in Pakistan's Quetta
పాక్​లోని మసీదులో భారీ పేలుడు..15 మంది మృతి

By

Published : Jan 10, 2020, 11:11 PM IST

Updated : Jan 10, 2020, 11:33 PM IST

పాకిస్థాన్​ బలూచిస్థాన్ రాష్ట్రం క్వెట్టా నగరంలోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనలు చేసేవారే లక్ష్యంగా బాంబు దాడికి పాల్పడ్డారు ముష్కరులు. ఈ దుర్ఘటనలో మత గురువు, ఓ సీనియర్​ పోలీసు అధికారి సహా మొత్తం 16 మంది మరణించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్వేట్టా ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలో బాంబ్​ పేలడం ఇదీ రెండోసారి.

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు భద్రతా సిబ్బంది.ఘటనా స్థలంలో తనిఖీలు ముమ్మరం చేశారు. సమీప ప్రాంతంలోని అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితి విధించారు.

మరణించిన వారిలో డీఎస్పీ ఓమనుల్లాహ్​ ఉన్నట్లు డీఐజీ తెలిపారు. పోలీసు అధికారి లక్ష్యంగా దాడులు చేసినట్లు అనుమానిస్తున్నామని వెల్లడించారు. గత నెలలో డీఎస్పీ కుమారుడిని అపహరించి హతమార్చినట్లు వివరించారు.

బలూచిస్థాన్​ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ముష్కరులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రులు. బాంబు దాడిని తీవ్రంగా ఖండించారు.


ఇదీ చూడండి:ఆడపిల్ల జోలికెళితే.. 'కాల్​'చేస్తున్న లిప్​స్టిక్​

Last Updated : Jan 10, 2020, 11:33 PM IST

ABOUT THE AUTHOR

...view details