తెలంగాణ

telangana

By

Published : Mar 10, 2022, 4:14 PM IST

ETV Bharat / international

లోయలో పడిన బస్సు- 14 మంది దుర్మరణం

Nepal Bus Accident: నేపాల్​లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిన ఘటనలో 14 మంది దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.

Nepal Bus Accident
Nepal Bus Accident

Nepal Bus Accident: బస్సు లోయలో పడి 14 మంది మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం నేపాల్​లో జరిగింది. తూర్పు నేపాల్​లో​ గురువారం ఉదయం 7.30 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. శంఖువాసవలోని మాడి నుంచి ఝాపాలోని దమక్‌కు వెళ్తుండగా.. బస్సు అదుపు తప్పి 300 మీటర్ల లోతు లోయలో పడింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఇదీ చూడండి:ఉక్రెయిన్​పై రష్యా బాంబుల వర్షం.. ప్రసూతి ఆసుపత్రి ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details