ఈశాన్య చైనా జిలిన్ ప్రాంతంలోని ఓ గిడ్డంగిలో అగ్నిప్రమాదం సంభవంచి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. జింగ్యే హైటెక్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జోన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
గిడ్డంగిలో అగ్నిప్రమాదం- 14 మంది మృతి - చైనా అగ్నిప్రమాదం న్యూస్ టుడే
గిడ్డంగిలో అగ్నిప్రమాదం సంభవించి 14మంది మృతిచెందారు. 26మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
![గిడ్డంగిలో అగ్నిప్రమాదం- 14 మంది మృతి warehouse,](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12561695-thumbnail-3x2-fire.jpg)
అగ్నిప్రమాదం, గిడ్డంగి
ఈ ఘటనలో 26మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. 12 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి కారణమేంటనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:చైనాలో వరద బీభత్సం- 10 బిలియన్ డాలర్ల నష్టం