తెలంగాణ

telangana

ఫిలిప్పీన్స్​లో కాల్పులు- 13 మంది మృతి

ఫిలిప్పీన్స్​లో దుండగులు- పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 13 మంది చనిపోయారు. వీరిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు.

By

Published : Jan 23, 2021, 7:42 PM IST

Published : Jan 23, 2021, 7:42 PM IST

13 killed in Philippines shootout
ఫిలిప్పీన్స్​లో దుండగులకు, పోలీసులకు మధ్య కాల్పులుఫిలిప్పీన్స్​లో దుండగులకు, పోలీసులకు మధ్య కాల్పులు

ఫిలిప్పీన్స్​లోని మెగుఇన్​దానావ్​ రాష్ట్రంలో పోలీసులకు, దుండగులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా 13 మంది మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ఓ హత్య, పలు దొంగతనాల కేసులో నిందితుడుగా ఉన్న ఓ వ్యక్తి.. సుల్తాన్​ కుర్దారాత్​ పట్టణంలో ఉన్నట్లు పోలీసులకు సమాచరం అందింది. వెంటనే అతన్ని అరెస్టు చేయడానికి శనివారం తెల్లవారుజామున 3గంటలకు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈ తరుణంలో వారిపై నిందితుని అనుచరులు కాల్పులకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు ఐదు గంటలపాటు కాల్పులు కొనసాగాయి.

అనంతరం ఘటనాస్థలం నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో మారణాయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:నేతాజీ జయంతి ఉత్సవాల్లో మమత అసహనం

ABOUT THE AUTHOR

...view details