ఫిలిప్పీన్స్లోని మెగుఇన్దానావ్ రాష్ట్రంలో పోలీసులకు, దుండగులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా 13 మంది మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఓ హత్య, పలు దొంగతనాల కేసులో నిందితుడుగా ఉన్న ఓ వ్యక్తి.. సుల్తాన్ కుర్దారాత్ పట్టణంలో ఉన్నట్లు పోలీసులకు సమాచరం అందింది. వెంటనే అతన్ని అరెస్టు చేయడానికి శనివారం తెల్లవారుజామున 3గంటలకు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈ తరుణంలో వారిపై నిందితుని అనుచరులు కాల్పులకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు ఐదు గంటలపాటు కాల్పులు కొనసాగాయి.