తెలంగాణ

telangana

ETV Bharat / international

కొండచరియలు విరిగిపడి 12మంది మృతి

By

Published : Jul 10, 2020, 1:42 PM IST

Updated : Jul 10, 2020, 2:24 PM IST

rains in nepal
నిర్విరామ వర్షాలతో...

14:09 July 10

నిర్విరామ వర్షాలతో..

48 గంటలుగా నిర్విరామంగా కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ నేపాల్​లో పలు చోట్ల కొండచరియలు విరిగి పడి 12మంది మృతి చెందారు. ఈ మైరకు పోలీసులు వివరాలను వెల్లడించారు. కొండ చరియలు పడి ఇళ్లకు ఇళ్లే కుప్పకూలాయి. ఈ ఘటనలో...  ఖాస్కీ జిల్లా సారంగ్​కోట్​లో ముగ్గురు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇతర చోట్ల జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మరో ఐదుగురు బలయ్యాయి.  పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 40 మంది గల్లంతయ్యారు

మరో మూడు రోజుల పాటు వర్షాలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.  

13:41 July 10

కొండచరియలు విరిగిపడి 12మంది మృతి

నేపాల్‌లో వేర్వేరు చోట్ల కొండచరియలు విరిగిపడి 12మంది మృతి చెందారు. మరో 40 మంది గల్లంతయ్యారు.

Last Updated : Jul 10, 2020, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details