తెలంగాణ

telangana

ETV Bharat / international

12 కోట్ల కరోనా పరీక్షలకు డబ్ల్యూహెచ్​ఓ 'ఒప్పందం' - ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా పరీక్షలు

కరోనాపై పోరులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో అడుగు ముందుకేసింది. తక్కువ, మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాల్లో కరోనా పరీక్షలను నిర్వహించేందుకు తన భాగస్వాములతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆయా దేశాల్లో 120మిలియన్​ ర్యాపిడ్​ పరీక్షలను నిర్వహించనుంది. అయితే ఈ మిషన్​కు డబ్ల్యూహెచ్​ఓ ఇంకా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు.

WHO, partners to produce 120 million virus tests
12కోట్ల కరోనా పరీక్షల కోసం డబ్ల్యూహెచ్​ఓ 'ఒప్పందం'

By

Published : Sep 29, 2020, 5:15 AM IST

తక్కువ, మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాల్లో.. 12కోట్ల (120మిలియన్)​ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు తన భాగస్వాములతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ). ఈ పరీక్షలన్నీ ర్యాపిడ్​ విధానంలో జరగనున్నాయి.

ఈ మిషన్​ కోసం తొలుత 600మిలియన్​ డాలర్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. కానీ మిషన్​కు డబ్ల్యూహెచ్​ఓ ఇంకా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు.

మరోవైపు ఈ ఒప్పందంపై డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ టెడ్రోస్​ అథనోమ్​ హర్షం వ్యక్తం చేశారు. కరోనాపై పోరులో ఇది ఓ శుభవార్త అని అభిప్రాయపడ్డారు.

"ఈ పరీక్షలతో ఫలితాలు 15-30నిమిషాల్లోనే వస్తాయి. తక్కువ ఖర్చుతో, అత్యాధునిక పరికరాలను ఇందుకోసం వినియోగించవచ్చు. ఫలితంగా విస్తృతంగా పరీక్షలు నిర్వహించవచ్చు. ల్యాబ్​లు లేని ప్రాంతాల్లో ఈ రకమైన పరీక్షలు ఎంతగానో పనికొస్తాయి. అయితే పరీక్షలు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో నిధులను సమకూర్చాల్సిన అవసరం ఉంది."

---- టెడ్రోస్​ అథనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​.

ర్యాపిడ్​ పరీక్షల్లో ఫలితాలు త్వరగా వచ్చినప్పటికీ.. పీసీఆర్​ పరీక్షలతో పోల్చుకుంటే వీటి ఖచ్చితత్వం చాలా తక్కువ.

ఇదీ చూడండి:-భారతీయ వ్యాక్సిన్​పై మోదీ భరోసా.. డబ్ల్యూహెచ్​ఓ ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details