కొవిడ్-19 మహమ్మారి మూలాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని శ్వేతసౌధంలో కరోనా సలహాదారు ఆండీ స్లావిట్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ, చైనాలు వైరస్పై ఉన్న సమాధానాలు, సందేహాలను ప్రపంచానికి వివరించాలన్నారు.
" మహమ్మారి పుట్టుక విషయంలో మనకు.. చైనా పారదర్శకమైన విధానం అందించాల్సి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా పూర్తి సహకారం అందించాలి. కానీ అది జరగటం లేదు."
-- ఆండీ స్లావిట్, శ్వేతసౌధం కొవిడ్-19 సలహాదారు