తెలంగాణ

telangana

ETV Bharat / international

'దివాలా' సంస్థకు రుణం- చిక్కుల్లో ట్రంప్ అల్లుడు!

ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ఓ ప్రైవేటు సంస్థకు 700 మిలియన్​ డాలర్ల రుణం ఇప్పించటంలో అధ్యక్షుడు​ ట్రంప్​ అల్లుడు జేరడ్​ కుష్నర్​ పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది మహమ్మారి సహాయ నిధి పర్యవేక్షణ ప్యానల్​. సదరు సంస్థ జాతీయ భద్రతకు కీలకమని పేర్కొంటూ భారీ మొత్తంలో రుణం ఇవ్వటంపై అమెరికా ట్రెజరీ విభాగాన్ని ప్రశ్నించింది. ఈ అంశంపై లోతైన దర్యాప్తు అవసరమని అభిప్రాయపడింది.

By

Published : Dec 11, 2020, 11:21 AM IST

Watchdog raises possible Kushner link
ట్రంప్​ అల్లుడు జేరడ్​ కుష్నర్

నష్టాల్లో కూరుకుపోయిన ఓ సంస్థకు రుణం అందించటంలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అల్లుడు జేరడ్​ కుష్నర్​ పాత్ర ఉండే అవకాశం ఉందని పేర్కొంది మహమ్మారి​ సహాయ నిధి పర్యవేక్షణ కమిటీ. సదరు సంస్థకు సుమారు 700 మిలియన్​ డాలర్ల విపత్తు సహాయ రుణం అందినట్లు తెలిపింది. ఆ సంస్థ నష్టాలతో సతమతమవుతున్న కారణంగా ప్రజల సొమ్ము నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

గురువారం జరిగిన విచారణంలో భాగంగా..'వైఆర్​సీ వరల్డ్​వైడ్' అనే సంస్థకు రుణం మంజూరు చేస్తూ ట్రెజరీ విభాగం తీసుకున్న నిర్ణయాన్ని ప్యానల్​ ప్రశ్నించింది. నలుగురు సభ్యుల కాంగ్రెస్​ నిఘా కమిషన్​లో ఒకరైన భరత్​ రామమూర్తి ఈ మేరకు కుష్నర్​ పాత్రను ప్రస్తావించారు.

జాతీయ భద్రతకు వైఆర్​సీ వ్యాపారం కీలకమంటూ రుణం ఇవ్వటాన్ని ప్యానల్​ సభ్యులు ప్రశ్నించారు. ట్రెజరీ విభాగం కార్పొరేట్​ సహాయ కార్యక్రమంలో భాగంగా జాతీయ భద్రతను పరిగణనలోకి తీసుకుని ఇంత భారీ మొత్తంలో రుణాలు ఇవ్వటం ఇదే తొలిసారి కావటం అనుమానాలకు తావిస్తోంది.

2017లోనే..

గతేడాది అపోలో గ్లోబల్​ మేనేజ్​మెంట్ నుంచి 600 మిలియన్​ డాలర్ల రుణం అందుకుంది వైఆర్​సీ. అపోలో నేతృత్వంలో పలు సంస్థలతో ఏర్పాటైన ప్రైవేటు ఈక్విటీ సంస్థ.. వైఆర్​సీకి అతిపెద్ద రుణదాతగా ఉన్నట్లు నిఘా ప్యానెల్​ వెల్లడించింది. అపోలో సహ వ్యవస్థాపకుడు జాషువా హారిస్​ 2017 తొలినాళ్లలో మౌలిక సదుపాయాల విధానంపై ట్రంప్​ పరిపాలన విభాగానికి సలహా ఇచ్చారు. అధ్యక్షుడి సలహాదారుగా ఉన్న కుష్నర్​ను కలిశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కుష్నర్​ కుటుంబానికి చెందిన స్థిరాస్తి సంస్థకు సుమారు 184 మిలియన్​ డాలర్లు అందించినట్లు రామమూర్తి తెలిపారని న్యూయార్క్​ టైమ్స్​ వెల్లడించింది.

విచారణ సందర్భంగా వైఆర్​సీ రుణాలకు సంబంధించి కుష్నర్​, ఆయన సిబ్బందితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని ట్రెజరీ కార్యదర్శి స్టివెన్​ మునుచిన్​ను ప్రశ్నించారు రామమూర్తి. దానికి తనకు ఎలాంటి సంబంధాలు లేవని సమాధానమిచ్చారు మునుచిన్​. శ్వేతసౌధానికి చెందిన ఎవరైనా ఈ రుణాల గురించి అభ్యర్థించారా అని మరో ప్రశ్న అడిగారు. ఈ అంశంపై మరింత లోతైన దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు రామమూర్తి. వైఆర్​సీ రూణాన్ని వేగంగా అమలు చేసిన, ఉదారంగా ఇచ్చిన లోన్​గా పేర్కొన్నారు. అయితే.. వైఆర్​సీకి రుణాలు ఇచ్చిన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు మునుచిన్​. జాతీయ భద్రతకు కీలకంగా మారే సంస్థల్లో వైఆర్​సీ అన్ని ప్రమాణాలను నిరూపించుకున్నట్లు తెలిపారు

అయితే.. ఈ అంశంపై కుష్నర్​ లేదా ఆయన సిబ్బంది ఎవరూ స్పందించలేదు.

మాకు సంబంధం లేదు..

ట్రెజరీ ఫండ్స్​ నుంచి రుణాలు పొందాలనే వైఆర్​సీ నిర్ణయంలో అపోలోకు సంబంధం లేదని పేర్కొన్నారు ఆ సంస్థ ప్రతినిధి జాన్​ రోస్​. వేల సంస్థలకు తాము రుణాలు అందించామని, వైఆర్​సీకి అందించిన వాటిలో తాము ఒకరమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కమల, ఫౌచీ పేర్లనే తప్పుగా పలికారు!

ABOUT THE AUTHOR

...view details