తెలంగాణ

telangana

ETV Bharat / international

"భారత్​కు ఆ సత్తా ఉంది" - ఉపరాష్ట్రపతి

భారత్​లోని ఉగ్రవాద నిర్మూలనకు ఇతర దేశాల మద్దతు అవసరం లేదని, తమ దేశానికి ఆ సామర్థ్యం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పరాగ్వే పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదంపై దేశాలన్నీ  కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.

భారత్​లోని ఉగ్రవాద నిర్మూలనకు ఇతర దేశాల మద్దతు అవసరం లేదన్న వెంకయ్యనాయుడు

By

Published : Mar 7, 2019, 10:33 AM IST

పరాగ్వే పర్యటనలో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఉగ్రవాదం మానవాళికి ప్రధాన శత్రువునని అన్నారు. దానిని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్​లో ఉగ్రవాద నిర్మూలనకు ఎలాంటి మద్దతు అవసరం లేదని, తమ దేశానికి ఆ సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు.

భారత్​లోని ఉగ్రవాద నిర్మూలనకు భారత్​కు సత్తా ఉందన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య

" ఉగ్రవాదం మానవాళికి ప్రధాన శత్రువు. దానికి మతం లేదు. అది పిచ్చి, ఉన్మాద చర్య. భూమిపై నుంచి దానిని సమూలంగా తొలగించాలి. అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా పోరాడినప్పుడే అది సాధ్యం. భారత్​లోని ఉగ్రవాదంపై పోరుకు ఎలాంటి మద్దతు అవసరం లేదు. భారత్​కు ఆ సామర్థ్యం ఉంది. ఇటీవలే అది నిరూపితమైంది. పుల్వామా ఉగ్రదాడికి బదులు తీర్చుకున్నాం. పాక్​ సైన్యంపై భారత వైమానికదళం దాడి చేయలేదు. ఒక్క పౌరునికి హానీ చేయలేదు. కచ్చితమైన లక్ష్యంపైనే దాడి చేశారు." -వెంకయ్య నాయుడు, భారత ఉపరాష్ట్రపతి

వివాదంపై విచారం

ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి... పుల్వామా ఉగ్రదాడికి దీటైన జవాబు చెప్పామన్నారు వెంకయ్య. వాయుసేన దాడుల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్యపై కొందరు వివాదం చేస్తున్నారని, ఇది సరికాదన్నారు. ఎవరికైనా అనుమానాలుంటే పాకిస్థాన్​కి వెళ్లి ఆ​ ప్రభుత్వాన్ని విచారించుకోవాలని భారత హోంమంత్రి తెలిపారని గుర్తుచేశారు.

పాక్​పై పరోక్షంగా..

పొరుగుదేశాలతో భారత్​ మంచి సంబంధాలు కోరుకుంటోందన్నారు వెంకయ్య. పొరుగుదేశాల్లోని ఓ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని పాకిస్థాన్​పై పరోక్షంగా విమర్శలు చేశారు. ఉగ్రవాద శిక్షణకు ఆ దేశం ఆర్థికంగా సహకరిస్తోందని, ఆశ్రయం కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details