దేశ జనాభాను పెంచేందుకు ప్రతి మహిళ ఆరుగురు పిల్లలకు జన్మనివ్వాలని వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో సూచించారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఇటీవల వెనిజువెలా నుంచి లక్షలాది మంది ప్రజలు వేరే దేశాలకు పారిపోతున్నారు. దీనివల్ల దేశ జనాభా గణనీయంగా తగ్గింది. జనన పద్ధతులకు ప్రోత్సహించే ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన మదురో.... ఈ సూచన చేశారు.
జనన పద్ధతులకు ప్రోత్సహించే ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన మదురో.. ఈ సూచన చేశారు. దేశానికి ఆరుగురు శిశువులను అందించేలా మహిళలను దేవుడు ఆశీర్వదిస్తాడని వెనిజువెలా అధ్యక్షుడు అన్నారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2015 నుంచి ఇప్పటి వరకూ సుమారు 45 లక్షల మంది ప్రజలు వెనిజువెలా నుంచి వలస వెళ్లారు.