తెలంగాణ

telangana

ETV Bharat / international

వెనెజువెలాలో తీవ్ర నీటి ఎద్దడి..!

వెనెజువెలాలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. దీనికి విద్యుత్ కోతలు తోడవటం వల్ల కనీసం నీటి పంపులు పనిచేయక జనం నానా అవస్థలు పడుతున్నారు. విద్యుత్ కోతలు ఆపాలని అధ్యక్షుడు నికోలస్​ మదురోను డిమాండ్ చేస్తున్నారు. నెలరోజుల పాటు విద్యుత్ కోత తప్పదని, ప్రజలు సహకరించాలని అధ్యక్షుడు మదురో ప్రజలను కోరారు.

By

Published : Apr 2, 2019, 12:30 PM IST

వెనెజువెలాలో తీవ్ర నీటి ఎద్దడి!

వెనెజువెలాలో తీవ్ర నీటి ఎద్దడి!

వెనెజువెలాలో రాజకీయ సంక్షోభం ప్రజల జీవితాలను దుర్భరం చేస్తోంది. ఇప్పటికే తీవ్ర విద్యుత్​ సమస్యలను ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రజలు, తాజాగా నీటి ఎద్దడితో ఇక్కట్ల పాలవుతున్నారు. కనీసం తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అధ్యక్షుడు నికోలస్ మదురో అధ్వాన్నంగా మారిన ప్రాథమిక సేవలను పునరుద్ధరించేందుకంటూ దేశవ్యాప్తంగా విద్యుత్​ కోత విధించారు. ఫలితంగా విద్యుత్​ సరఫరా తగినంతగా లేక నీటి​ పంపులు పనిచేయట్లేదు. రాజధాని కారకస్​లోనూ ప్రజలు నీటి పంపుల వద్ద బారులు తీరుతున్నారు.

"మా సమస్యలు తీర్చమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఇది తీవ్రమైన సమస్య. విద్యుత్, నీళ్లు లేకపోవడం చాలా ఇబ్బంది కలిగిస్తోంది. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు." -మారా రోజా, వెనెజువెలా పౌరురాలు

చల్లారని మంటలు

వెనెజువెలాలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధ్యక్షుడు మదురో, ప్రతిపక్ష నాయకుడు జువాన్​ గైడో అధికారం కోసం పెనుగులాడుతున్నారు. దేశం ఆర్థికంగా పతనమవుతోంది. మార్చి 7 నుంచి మొదలైన విద్యుత్ సంక్షోభం నానాటికీ జఠిలమవుతోంది. విద్యుత్ సరఫరా​ లేక తాజాగా నీటి సమస్య మొదలైంది. రవాణా సౌకర్యాలకు ఇబ్బంది కలుగుతోంది. ఇలా వరుస సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details