తెలంగాణ

telangana

ETV Bharat / international

వెనెజువెలా జైలులో ఘర్షణ-23మంది ఖైదీల మృతి

వెనెజువెలా జైలులో చెలరేగిన అల్లర్లలో 23మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. ఖైదీల దుష్ప్రవర్తనే ఘటనకు దారితీసిందని అధికారులు ప్రకటించారు.

By

Published : May 25, 2019, 6:43 AM IST

జైలులో ఘర్షణ-23మంది ఖైదీల మృతి

అధికారులు, ఖైదీల మధ్య ఘర్షణ వెనెజువెలాలో 23మంది ప్రాణాలు పోయేందుకు కారణమయింది. పోర్చుగీసా రాష్ట్రం లోని ఓ జైలులో బ్యారక్​లోకి అధికారులను ఖైదీలు అనుమతించకపోవడం ఈ ఘటనకు దారితీసింది. తమ వద్ద ఉన్న ఆయుధాలు, అనుమతి లేని వస్తువులను స్వాధీనం చేసుకుంటారన్న అనుమానంతో అధికారులను నిలువరించేందుకు ఖైదీలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 23మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోగా, 18మంది భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.

జట్లుగా విడిపోయిన ఖైదీలు జైళ్లలో మాదక ద్రవ్యాలు, ఆయుధాలను సరఫరా చేస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు.

"ఘటనకు కారణం బ్యారక్​లను అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మార్చిన ఖైదీలదే"

-హంబర్టా ప్రాడో, వెనెజువెలా జైళ్ల అధికారి

"ఘటన జరిగిన బ్యారక్​ సామర్థ్యం 250 మంది మాత్రమే. కానీ 540 మందిని కుక్కారు. కిక్కిరిసి పోయిన జైలు బ్యారక్​లో ఖైదీలపై దాడి చేసి మట్టుబెట్టారని" ఖైదీల హక్కుల సంఘం ఆరోపించింది.

2017 నుంచి ఇప్పటివరకు వెనెజువెలాలో 130 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. గతేడాది వల్​నికాలోని జైలులో 68 మంది ఖైదీలు మరణించారు. అంతకు ముందు సంవత్సరం జరిగిన అల్లర్లలో 39మంది మృతి చెందారు. వెనెజువెలాలోని 30 జైళ్లలో 57వేలమంది ఖైదీలు వివిధ కేసుల్లో శిక్షలను అనుభవిస్తున్నారు.

ఇదీ చూడండి: జీ-20 సదస్సులో మోదీ-ట్రంప్​ భేటీ!

ABOUT THE AUTHOR

...view details