తెలంగాణ

telangana

By

Published : Mar 4, 2021, 10:14 AM IST

ETV Bharat / international

'కశ్మీర్​ విషయంలో భారత్​ చర్యలు భేష్​'

జమ్ముకశ్మీర్​ను సాధారణ స్థితికి తీసుకురావడానికి భారత్​ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నామని అమెరికా తెలిపింది. భారత్​ తమకు వ్యూహాత్మక భాగస్వామని తెలిపిన అగ్రరాజ్యం.. ఆయుధాల విక్రయంలో భారతదేశ భద్రత, సార్వభౌమాధికారానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది..

US welcomes steps taken to return J-K to full economic and political normalcy
'కశ్మీర్​ విషయంలో భారత్​ చర్యలను భేష్​'

జమ్ముకశ్మీర్​లో ఆర్థిక, రాజకీయ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి భారత్​ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఈ చర్యలు భారత ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉన్నాయని కొనియాడింది. కశ్మీర్​కు సంబంధించి అమెరికా విధానంలో ఎలాంటి మార్పు రాదన్న ఆ దేశ విదేశాంగ ప్రతినిధి నెడ్​ ప్రైస్.. కేంద్రపాలిత ప్రాంతంలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు.

భారత్‌తో పాటు పాకిస్థాన్​తో అమెరికాకు కీలక సంబంధాలు ఉన్నాయన్నారు ప్రైస్. "ఇరు దేశాలతోనూ నిర్మాణాత్మక సంబంధాలున్నాయి. భారత్​ వ్యూహాత్మక భాగస్వామి. పాక్​ ప్రాంతంలో కీలక ప్రయోజనాలు ఉన్నాయి. వీటి కోసం పాక్​ అధికారులతో కలిసి పని చేయాలని భావిస్తున్నాం" అని ప్రైస్ అన్నారు. కశ్మీర్​ సహా ఇతర సమస్యలపై భారత్​-పాకిస్థాన్​ల మధ్య చర్చలకు అమెరికా మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.

'భారత్​ భద్రతకు కట్టుబడి ఉంది'

భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామని పేర్కొన్న అమెరికా.. రక్షణ పరికరాల విక్రయాల విషయంలో ఆ దేశ భద్రత, సార్వభౌమాధికారానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ఇప్పటివరకు భారత్​తో 20 బిలియన్​ డాలర్ల రక్షణ ఒప్పందాలు జరిగినట్లు ప్రైస్​ తెలిపారు.

ఇదీ చూడండి:భారత నౌకాశ్రయంపై సైబర్‌దాడి యత్నాల్లో చైనా!

ABOUT THE AUTHOR

...view details