తెలంగాణ

telangana

ETV Bharat / international

'సుంకాల మహారాజు' భారత్​​ : అమెరికా - US wants India to lower its tariffs

భారత్​ను సుంకాల మహారాజుగా శ్వేతసౌధం వాణిజ్య, ఆర్థిక సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్యానించారు. తమ ఉత్పత్తులపై వసూలు చేస్తున్న అధిక సుంకాలను భారత్​ తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేదంటే తాము కూడా భారత ఉత్పత్తులపై సుంకాలు పెంచాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

US wants India to lower its tariffs:  White house official
అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలను భారత్ తగ్గించాలి: యూఎస్​

By

Published : Dec 19, 2019, 5:56 AM IST

Updated : Dec 19, 2019, 11:59 AM IST

'సుంకాల మహారాజు' భారత్​​ : అమెరికా

అమెరికా ఉత్పత్తులపై భారత్​ సుంకాలను తగ్గించాలని అగ్రరాజ్యం కోరుకుంటున్నట్లు శ్వేతసౌధం వాణిజ్య, ఆర్థికసలహాదారు పీటర్ నవారో అన్నారు.

సుంకాల మహారాజు

శ్వేతసౌధం వాణిజ్యం, తయారీ పాలసీకి నేతృత్వం వహిస్తున్న నవారో.. ఓ టీవీ ఛానల్​ ముఖాముఖిలో భారత పన్నుల విధానంపై మాట్లాడారు. భారత ఉత్పత్తులపై అమెరికా వసూలు చేస్తున్న సుంకాల కంటే.. 90 శాతం అధికంగా తమ ఉత్పత్తులపై ఇండియా సుంకాలు విధిస్తోందని అన్నారు. ఈ అధిక సుంకాలను తగ్గించి, పరస్పర ఆరోగ్యకరమైన వాణిజ్యానికి తోడ్పడాలని నవారో కోరారు.

"మేము భారత్​లో వాణిజ్యం చేస్తున్నాం. నేను సరదాగా అంటున్నా.. 'భారతదేశం సుంకాల మహారాజు'. విదేశీ ఉత్పత్తులపై ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశం భారత్​. ఇది హాస్యాస్పదం."- పీటర్​ నవారో, శ్వేతసౌధం వాణిజ్య, ఆర్థిక సలహాదారు

మేమూ సుంకాలు పెంచుతాం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ 'పరస్పర వాణిజ్య చట్టానికి' పెద్ద అభిమాని అని నవారో తెలిపారు. ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించకపోతే.. ఆయా దేశాల ఉత్పత్తులపై అమెరికా కూడా సుంకాలు పెంచేందుకు ఇది వీలుకల్పిస్తుంది అని ఆయన అన్నారు.

టారిఫ్ కింగ్​

ట్రంప్ కూడా భారత్​ను పదేపదే 'టారిఫ్​ కింగ్'​గా అభివర్ణిస్తున్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ విపరీతంగా అధిక సుంకాలు వసూలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి: ముగిసిన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

Last Updated : Dec 19, 2019, 11:59 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details