తెలంగాణ

telangana

ETV Bharat / international

కశ్మీర్​లో మానవహక్కులపై అమెరికా కీలక వ్యాఖ్యలు

జమ్ముకశ్మీర్​లో మానవహక్కులకు సంబంధించి భద్రతా ప్రాధాన్యాలను భారత్ సమతౌల్యం చేసుకోవాలని అమెరికా విజ్ఞప్తి చేసింది. జాతీయ పౌర జాబితా (ఎన్​ఆర్​సీ) తుది ముసాయిదాపైనా ఆందోళన వ్యక్తం చేసింది.

By

Published : Oct 23, 2019, 5:23 AM IST

Updated : Oct 23, 2019, 7:36 AM IST

కశ్మీర్​లో మానవహక్కులపై అమెరికా కీలక వ్యాఖ్యలు

కశ్మీర్​లో మానవహక్కులపై అమెరికా కీలక వ్యాఖ్యలు

జమ్ముకశ్మీర్​ భద్రతా ప్రాధాన్యాలను, అక్కడి ప్రజల మానవహక్కులను భారత్​ సమతౌల్యం చేసుకోవాలని అమెరికా విజ్ఞప్తి చేసింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్​లోని ప్రముఖ రాజకీయ నాయకుల్ని నిర్బంధించడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రభుత్వంలో ఉన్నతాధికారి అయిన రాబర్ట్ డెస్ట్రో.. దక్షిణాసియాలో మానవహక్కులు' అంశంపై కాంగ్రెస్ ఉపసంఘంలో ప్రసగిస్తూ 'కశ్మీర్​'పై కీలక వ్యాఖ్యలు చేశారు.

"భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35 ఏ అధికరణలను ఆగస్టు 5న రద్దు చేసినప్పటి నుంచి.. జమ్ముకశ్మీర్​లో మానవహక్కులకు సంబంధించి భద్రతా ప్రాధాన్యతలను సమతౌల్యం చేసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేస్తామని ప్రకటించారు. దానిని మేము స్వాగతిస్తున్నాం. అయితే ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు మిశ్రమంగా ఉన్నాయి"- రాబర్ట్​ డెస్ట్రో, ప్రజాస్వామ్యం, మానవహక్కులు, కార్మికశాఖ సహాయ కార్యదర్శి

ఎన్​ఆర్​సీపైనా ఆందోళన

జాతీయ పౌర జాబితా (ఎన్​ఆర్​సీ) తుది ముసాయిదాపైనా రాబర్ట్​ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అసోంలోని 1.9 మిలియన్ ప్రజల పౌరసత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తోందని పేర్కొన్నారు.

బాగుంది కానీ..

ప్రస్తుతంకశ్మీర్​లోని చాలా ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేశారని, ల్యాండ్​లైన్లు పునరుద్ధరించారని, చాలా మంది ఖైదీలను విడుదల చేశారని రాబర్ట్​ డెస్ట్రో కాంగ్రెస్​కు తెలిపారు. అయితే ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో అంతర్జాలం, మొబైల్ ఫోన్ సేవలు పునరుద్ధరించలేదన్నారు. కశ్మీర్​లో ఆరోగ్య సేవలు ఆలస్యమవుతున్నాయని, ఔషధాల కొరత ఉన్నట్లు, వ్యాపారాలు నిలిచిపోయినట్లు నివేదికలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

కమ్యూనికేషన్​ను స్తంభింపజేయడం వల్ల స్థానిక కార్యకర్తలు, పాత్రికేయులు అక్కడి వార్తలను ఎప్పటికప్పుడు అందించలేకపోతున్నారని రాబర్ట్ తెలిపారు.

అంతా బాగుంది

జమ్ము కశ్మీర్​లో మందుల కొరత లేదని, నిత్యవసర సామగ్రి ప్రజలకు అందుబాటులో ఉందని గవర్నర్​ సత్యపాల్​ మాలిక్ స్పష్టం చేశారు. కనీస సౌకర్యాలు లేవని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. సమాచార సేవలు నిలిపివేయడం.. ఎంతో మంది ప్రాణాలు కాపాడడానికి తోడ్పడిందని మాలిక్ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:పాక్​ తీరే శాంతి చర్చలకు అవరోధం: అమెరికా

Last Updated : Oct 23, 2019, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details