తెలంగాణ

telangana

ETV Bharat / international

'హెచ్చరించినా వినలేదు- డ్రోన్​ను కూల్చేశాం'

అమెరికా-ఇరాన్​ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్​కు చెందిన డ్రోన్​ను హర్మోజ్​ జలసంధి వద్ద అమెరికా యుద్ధనౌక కూల్చివేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. అయితే ట్రంప్​ ప్రకటనను ఇరాన్​ ఖండించింది. డ్రోన్​ కూల్చివేత తమ దృష్టికి రాలేదని పేర్కొంది.

By

Published : Jul 19, 2019, 10:47 AM IST

'హెచ్చరించినా వినలేదు- డ్రోన్​ను కూల్చేశాం'

ఇరాన్​-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. కొద్ది రోజుల క్రితంఅమెరికాకు చెందిన నిఘా డ్రోన్​ను ఇరాన్​ కూల్చడం.. ఇరు దేశాల మధ్య ఘర్షణకు కారణమైంది. తాజాగా ఇరాన్​కు చెందిన ఓ డ్రోన్​ను అమెరికా యుద్ధనౌక కూల్చివేసిందంటూ ట్రంప్​ ప్రకటించడం మరోసారి ఉద్రిక్తతలకు తెరలేపింది.

గురువారం అంతర్జాతీయ సముద్ర జలాల్లోని హర్మోజ్​ జలసంధి వద్ద గస్తీ కాస్తోన్న 'యూఎస్ఎస్​ బాక్సర్'​ నౌక.. సుమారు 1000 గజాల దూరంలో ఇరాన్​ డ్రోన్​ను గమనించింది. పలు మార్లు హెచ్చరించినా డ్రోన్​ను ల్యాండ్​ చేయకపోవడం వల్ల కూల్చివేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ తెలిపారు.

"డ్రోన్​ను వెనువెంటనే కూల్చేశాం. అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఉన్న నౌకలపై ఇరాన్​ జరిపే రెచ్చగొట్టే చర్యల్లో ఇదీ ఒకటి. మా నౌకకు ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా మేం రక్షణాత్మక వైఖరితో దాడి చేశాం. మిగిలిన దేశాలూ జలసంధి వద్ద ఉన్న వారి నౌకలను జాగ్రత్తగా చూసుకోవాలి." - డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఖండించిన ఇరాన్​...

ట్రంప్​ వ్యాఖ్యలను ఇరాన్​ విదేశాంగ మంత్రి జావద్​ జరీఫ్ తోసిపుచ్చారు. ఇరాన్​ డ్రోన్​ కూలినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు.

ఆంక్షల మోత...

ఇరాన్​ అణు కార్యక్రమంలో భాగమైన సంస్థలు, 12 మంది వ్యక్తులపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. అమెరికాలో ఉన్న వారి ఆస్తులను స్తంభింప చేస్తున్నట్లు పేర్కొంది. ఒప్పందం కుదరాలంటే... ఇరాన్​ అణ్వాయుధాల తయారీ ఆపాలని ట్రంప్​ మరోసారి హెచ్చరించారు.

"ఇరాన్​ తాజాగా చేపట్టిన ప్రమాదకర అణు కార్యక్రమాలను అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది. పరిమితులకు మించి యురేనియం నిల్వ చేయండం, 3.67 శాతం కంటే ఎక్కువ సాంద్రతను మించి యురేనియాన్ని శుద్ధి చేయడం వంటి వాటిని అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు."
- మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి

ABOUT THE AUTHOR

...view details