తెలంగాణ

telangana

ETV Bharat / international

కశ్మీర్​పై అమెరికాది అదే మొండి వైఖరి!

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు చేసిన నేపథ్యంలో.. కశ్మీర్​ అంశంపై తమ వైఖరి మారదని స్పష్టం చేసింది అమెరికా. భారత్​, పాకిస్థాన్​ సంయమనం పాటించాలని సూచించింది.

కశ్మీర్​పై అమెరికాది అదే మొండి వైఖరి!

By

Published : Aug 9, 2019, 10:07 AM IST

Updated : Aug 9, 2019, 11:54 AM IST

కశ్మీర్​ వివాదాన్ని... భారత్​-పాకిస్థాన్​కు సంబంధించిన ద్వైపాక్షిక అంశంగానే పరిగణిస్తున్నట్లు పునరుద్ఘాటించింది అమెరికా. భారత్​కు అంతర్గత వ్యవహారమైన కశ్మీర్​ సమస్యకు పరిష్కారం కోసం కేంద్రం ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది అగ్రరాజ్యం.

కశ్మీర్​ విషయంలో అమెరికా వైఖరి మారిందా అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మోర్గన్​ ఓర్టగస్​ను వాషింగ్టన్​లో ప్రశ్నించగా... లేదని సమాధానం ఇచ్చారు.

"అందరూ సంయమనంతో ఉండాలని మేము కోరుతున్నాం. శాంతి, స్థిరత్వాన్ని ప్రధానంగా కోరుకుంటున్నాం. కశ్మీర్, ఇతర సమస్యల పరిష్కారానికి భారత్​, పాక్ నేరుగా చర్చించేందుకు మేము మద్దతు ఇస్తాం."

- మోర్గన్​ ఓర్టగస్​, అమెరికా ప్రతినిధి.

ఇదీ చూడండి: భారత్​పై ప్రతీకార దుశ్చర్యలు వద్దు: అమెరికా

Last Updated : Aug 9, 2019, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details