అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్ల కిందట ప్రపంచ మానవ హక్కుల సంఘం నుంచి అగ్రదేశం ఇప్పటికే వైదొలిగింది. బైడెన్ తీసుకున్న నిర్ణయంతో ఆ దేశం తిరిగి యూఎన్ మానవ హక్కుల సంఘంతో ఒప్పందం చేసుకోనుంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్కు సంబంధించిన విషయంపై మానవహక్కలు సంఘం ప్రవర్తించిన తీరుకు నిరసనగా అమెరికా బయటకు వచ్చింది.
బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై చట్టసభ సభ్యులు నుంచే కాకుండా, ఇజ్రాయేల్లో చాలా మంది నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, జెనీవాలోని మరో సీనియర్ అమెరికా దౌత్యవేత్త కలసి ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో అమెరికా శాశ్వత సభ్యదేశంగా కొనసాగే దిశగా ఎన్నికను కోరనుంది అమెరికా.