కరోనా విలయం కొనసాగుతున్న వేళ.. అమెరికన్లు వీలైనంత త్వరగా భారత్ను విడిచి రావాలని బైడెన్ సర్కారు సూచించింది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికన్లు ఎవరూ భారత్కు ప్రయాణాలు కూడా చేయవద్దని స్పష్టం చేసింది.
భారత్లో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున.. అవసరమైన వైద్య సేవలు పరిమితంగానే అందుతాయని అమెరికా తమ పౌరులకు చెప్పింది. ఈ మేరకు లెవల్ ఫోర్లో పెడుతూ అడ్వైజరీ జారీ చేసింది. అత్యంత ప్రమాదం కింద ఈ లెవల్ హెచ్చరికలు అమెరికాలో జారీ చేస్తారు.