తెలంగాణ

telangana

ETV Bharat / international

'సౌదీ చమురు క్షేత్రాలపై దాడి ఇరాన్​ పనే'

సౌదీ అరేబియాలోని ఆరాంకో చమురు శుద్ధి కేంద్రాలపై దాడులకు ఇరాన్​ కారణమని అమెరికా ఆరోపించింది. ఇరాన్​తో సంబంధాలున్న హుతీ తిరుగుబాటుదారులు ఈ దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దాడి జరిగిన చమురు క్షేత్రల్లో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సౌదీ ప్రకటించింది.

By

Published : Sep 15, 2019, 8:48 AM IST

Updated : Sep 30, 2019, 4:08 PM IST

'సౌదీ చమురు క్షేత్రాలపై దాడి ఇరాన్​ పనే'

'సౌదీ చమురు క్షేత్రాలపై దాడి ఇరాన్​ పనే'

సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరాంకోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమనీ తిరుగుబాటుదారులు చేసిన డ్రోన్ల దాడిపై అమెరికా స్పందించింది. ఇది ఇరాన్ పని అయి ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో ఆరోపించారు. ఇరాన్​-అమెరికా ఉద్రిక్తతల నడుమ పాంపియో ప్రకటనకు ప్రాధాన్యం నెలకొంది.

'సౌదీ చమురు క్షేత్రాలపై దాడి ఇరాన్​ పనే'

"సౌదీ చమురు క్షేత్రాలపై దాడికి యెమెన్ కారణమనడానికి ఆధారాలు లేవు. అయితే చమురు ఉత్పత్తిపై ఇంతకుముందెన్నడూ జరగని దాడిని ఇరాన్ ఇప్పుడు​ చేసింది. ఇరాన్​ దాడిని అన్ని దేశాలు ఖండించాలి. దీనికి కచ్చితంగా ఇరాన్​ బదులు చెప్పాల్సిందే." - మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి.

తాత్కాలిక నిలిపివేత...

దాడి జరిగిన ఆరాంకోకు చెందిన రెండు చమురు కేంద్రాల్లో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తూ సౌదీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యువరాజు బిన్​ సల్మాన్​ ప్రకటించారు. మొత్తం ఉత్పత్తిలో 50 శాతం మీద ఈ ప్రభావం పడనున్నట్లు తెలిపారు.
ఈ దాడుల ప్రభావంగా రోజుకు 5.7 మిలియన్​ బ్యారెల్​ చమురు ఉత్పత్తి నిలిచిపోనున్నట్లు ఆరాంకో ప్రకటించింది. ఈ దాడిలో ఎవరికి గాయలు కాలేదని తెలిపింది.

ఇదీ చూడండి:-బంగారు టాయ్​లెట్​ను దొంగలెత్తుకెళ్లారు..!

Last Updated : Sep 30, 2019, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details