తెలంగాణ

telangana

By

Published : Dec 19, 2020, 5:21 PM IST

Updated : Dec 19, 2020, 5:30 PM IST

ETV Bharat / international

మరో 59 చైనా కంపెనీలపై అమెరికా ఆంక్షలు

అగ్రరాజ్యం అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. చైనాకు చెక్​ పెట్టేందుకు అమెరికా చేపడుతోన్న వరుస చర్యలతో డ్రాగన్​ గుర్రుగా ఉంది. చైనాకు చెందిన 59 కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది.

US blacklists 59 Chinese entities including SMIC
మరో 59 చైనా కంపెనీలపై అమెరికా నిషేధం

అగ్రరాజ్యం అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. చైనాకు చెందిన 59 కంపెనీల ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తూ ఆ దేశ వాణిజ్య విభాగం నిర్ణయం తీసుకుంది. వీటిని బ్లాక్​లిస్ట్​లో ఉంచింది. కంప్యూటర్​ విడిభాగాల్లో వినియోగించే సెమీకండక్టర్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనా కంపెనీ అంతర్జాతీయ సెమీకండక్టర్ కార్పోరేషన్​ను(ఎస్​ఎంఐసీ) సైతం ఈ జాబితాలో చేర్చడం గమనార్హం.

జాతీయ భద్రత కోసమే..

అమెరికా జాతీయ భద్రతతో పాటు.. విదేశాంగ విధానాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఎస్​ వాణిజ్య విభాగం తెలిపింది. తమ అత్యాధునిక సాంకేతికతను అమెరికా విరోధులు వాడుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆ దేశ వాణిజ్య కార్యదర్శి విల్​బర్​ రాస్​ తెలిపారు. సైనిక అవసరాలకు తగిన ఉత్పత్తులను ఎస్​ఎంఐసీ విరివిగా ఉత్పత్తి చేస్తూ.. విచ్చలవిడిగా వినియోగిస్తూ పౌరుల భద్రతను ప్రమాదంలోకి నెడుతోందని రాస్​ అన్నారు. ఈ కంపెనీ దిగుమతులపై ఆంక్షలతో అమెరికా భద్రతా దళాలను అస్థిరపరచే కుట్రకు తెరదించినట్టవుతుందని ఆయన​ అభిప్రాయపడ్డారు. వీటితో పాటు.. మానవ హక్కులకు భంగం కలిగించేలా డీఎన్​ఏ పరీక్షలు నిర్వహించే, నిరంతర నిఘాకు ఉపకరించే పరికరాల ఉత్పత్తులపైనా ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు.

59 కంపెనీల ఉత్పత్తుల ఆంక్షలపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో స్పందించారు. ఈ చర్యలతో దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆగడాలకు అడ్డుకట్టపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:ఇండో పసిఫిక్​లో శాంతి కోసం 'క్వాడ్'​ చర్చలు

Last Updated : Dec 19, 2020, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details