తెలంగాణ

telangana

ETV Bharat / international

మానవ మృతదేహాలతో ఎరువు తయారీ...!

అమెరికాలోని వాషింగ్టన్ నూతన ఒరవడికి తెర తీసింది. మానవ మృతదేహాలతో పొలాల్లో ఎరువును సృష్టించడాన్ని చట్టబద్ధం చేసింది. భూస్థాపన స్థలాలు, దహన సంస్కారాలు శ్మశానాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

By

Published : May 22, 2019, 9:34 AM IST

Updated : Sep 30, 2019, 5:39 PM IST

శరీరంతో ఎరువు-అమెరికాలో నూతన నిర్ణయం

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం నూతన ఒరవడికి తెరతీసింది. మానవ మృతదేహాలను సేంద్రియ ఎరువుగా మార్చడాన్ని చట్టబద్ధం చేసింది. భూస్థాపన స్థలాలు, శ్మశానాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. చనిపోయిన వారి మృతదేహాలను ఉద్యానవనాల్లో ఎరువుగా ఉపయోగించేందుకు అనుమతించనుంది .

"ప్రకృతికి తిరిగివ్వడం అనేది మానవ జీవన చక్రంలో భాగం. మరణం కూడా ఇందులో అందంగా కన్పిస్తుంది."

-కత్రినా స్పేడ్, మానవ ఎరువు పరిశోధకురాలు

మానవ మృతదేహంతో ఎరువు తయారీ అనే అంశంపై పదేళ్ల కిందట తనకు ఆసక్తి కలిగిందని కత్రినా చెప్పారు. సాంకేతికంగా అమలు సాధ్యమేనా అని పరిశీలించారు. ఈ ప్రక్రియలో భాగంగా మృతదేహాన్ని30 రోజుల పాటు ఓ పెట్టెలో ఉంచుతారు. అనంతరం ఎరువుగా వాడతారు.

వచ్చే సంవత్సరం మే నుంచి ఈ చట్టం అమలవుతుంది.

ఇదీ చూడండి: 'రాజకీయ లబ్ధి కోసమే రఫేల్​పై ఆరోపణలు'

Last Updated : Sep 30, 2019, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details