తెలంగాణ

telangana

By

Published : Jan 3, 2020, 5:50 AM IST

Updated : Jan 3, 2020, 10:04 AM IST

ETV Bharat / international

పాక్​ గగనతలంలో అమెరికా విమానాలకు ఉగ్ర ముప్పు

పాకిస్థాన్​ గగనతలంలో అమెరికా విమానాలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని ఫెడరల్​ ఏవియేషన్​ అడ్మినిష్ట్రేషన్​( ఎఫ్ఏఏ) హెచ్చరించింది. అమెరికాకు చెందిన విమానయాన సంస్థలు, పైలట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

US airlines operating in Pakistan airspace face risk of extremist activity: US aviation regulator
పాక్​ గగనతలంలో అమెరికా విమానాలకు ఉగ్ర ముప్పు

పాక్​ గగనతలంలో అమెరికా విమానాలకు ఉగ్ర ముప్పు

పాకిస్థాన్​ గగనతలంలో తిరిగే విమానాలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని అమెరికా విమానయాన సంస్థ ఫెడరల్​ ఏవియేషన్​ అడ్మినిస్ట్రేషన్​( ఎఫ్​ఏఏ) హెచ్చరించింది. పాక్​లోని విమానాశ్రయాల్లో ఆగి ఉన్న, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొంది.

అయితే పాకిస్థాన్​లో ఇప్పటివరకు సివిల్​ ఏవియేషన్​ సెక్టార్​కు వ్యతిరేకంగా ఎటువంటి మ్యాన్​ పాడ్(మ్యాన్​ పోర్టెబుల్​ ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్​​)​లు వాడుతున్నట్లు ఆధారాలు లేవని, కానీ కొన్ని ఉగ్రవాద సంస్థలు ఈ మ్యాన్​ ప్యాడ్​లను వినియోగిస్తున్నట్లు ఎఫ్​ఏఏ అనుమానం వ్యక్తం చేసింది.

ల్యాండింగ్​ టేకాఫ్​ సమయాల్లో.. ఉగ్ర ముఠాలు తుపాకులతో, విమాన విధ్వంసక ఆయుధాలతో కానీ దాడికి తెగబడొచ్చని హెచ్చరించింది. అమెరికాకు చెందిన విమానయాన సంస్థలు, పైలట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

నిత్యం వార్తల్లో పాక్​...

ఉగ్రవాదం నేపథ్యంలో పాకిస్థాన్, ఆ దేశ గగనతలం​పై నిషేధం నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. భారత వైమానిక దళం బాలాకోట్​లో చేసిన దాడి తర్వాత.. పాక్​ గత ఏడాది ఫిబ్రవరి 26 నుంచి ఐదు నెలలపాటు గగనతలాన్ని మూసివేసింది.

సౌదీ అరేబియా పర్యటన కోసం ప్రధాని మోదీ విమానాన్ని పాక్​ గగనతలం నుంచి వెళ్లేందుకు అనుమతించాలని గత అక్టోబరులో భారత్ కోరింది. కానీ పాక్​ అందకు నిరాకరించింది.

Last Updated : Jan 3, 2020, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details