తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా​ పరిశోధనలే లక్ష్యంగా చైనీయులు హ్యాకింగ్​!

కరోనా పరిశోధనలే లక్ష్యంగా ఇద్దరు చైనీయులు హ్యాంకింగ్​కు పాల్పడుతున్నారని అమెరికా ఆరోపించింది. ఈ హ్యాకర్లు.. ప్రపంచ దేశాల్లోని సంస్థలకు చెందిన వ్యాపార రహస్యాలను దొంగిలిస్తున్నారని అభియోగం మోపింది.

By

Published : Jul 22, 2020, 5:46 AM IST

US accuses Chinese hackers in targeting of COVID-19 research
కరోనా​ పరిశోధనలే లక్ష్యంగా చైనీయులు హ్యాకింగ్​!

కరోనా​పై జరుగుతున్న పరిశోధనలే లక్ష్యంగా ఇద్దరు చైనా హ్యాకర్లు విరుచుకుపడుతున్నారని అమెరికా న్యాయశాఖ ఆరోపించింది. దీనితో పాటు ప్రపంచ దేశాల్లోని కంపెనీలకు చెందిన మిలియన్​ డాలర్ల వ్యాపార రహస్యాలను వీరు దొంగిలించారని వెల్లడించింది.

ఇటీవలి కాలంలో ఈ హ్యాకర్లు.. కరోనా చికిత్స, వ్యాక్సిన్​ కోసం కృషి చేస్తున్న కంపెనీలను లక్ష్యంగా చేసుకుని, వాటి కంప్యూటర్​ వ్యవస్థపై దాడి చేసినట్టు అమెరికా న్యాయశాఖ పేర్కొంది. తమకు, చైనా ప్రభుత్వానికి ఉపయోగపడే విలువైన సమాచారాన్ని దొంగిలించినట్టు ఆరోపించింది. ఈ మేరకు హ్యాకర్లపై మోసం, వ్యాపార రహస్యాల దోపిడి కింద నేరాభియోగపత్రం దాఖలు చేసింది.

కరోనా పరిశోధనలకు సంబంధించి విదేశీ హ్యాకర్లపై కేసు నమోదు చేయడం ఇదే తొలిసారి. అయితే విలువైన డేటా హ్యాంకింగ్​కు గురయ్యే అవకాశముందని అమెరికా-పాశ్చాత్య నిఘా సంస్థలు ఎన్నో నెలల నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాయి. గత వారమే.. రష్యా నిఘా వ్యవస్థతో సంబంధం ఉన్న ఓ హ్యాకింగ్​ బృందం కరోనా పరిశోధనలను హ్యాక్​ చేయడానికి యత్నిస్తోందని అమెరికా-కెనడా-బ్రిటన్​ ఆరోపించాయి.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details