తెలంగాణ

telangana

భారత్​, చైనాలు సంయమనం పాటించాలి: ఐరాస

భారత్​, చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘటన, పలువురు జవాన్లు ప్రాణాలు కోల్పోవటంపై ఆందోళన వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది.

By

Published : Jun 17, 2020, 1:08 AM IST

Published : Jun 17, 2020, 1:08 AM IST

UN chief expresses concern about reports of violence
భారత్​, చైనాలు సంయమనం పాటించాలి: ఐరాస

తూర్పు లద్దాఖ్​లోని గాల్వాన్​​ లోయలో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​, చైనా దేశాల సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​. ఉద్రిక్తతలు చెలరేగుతున్న పరిస్థితుల్లో ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఈ మేరకు ఆయన అధికార ప్రతినిధి ఎరి కనెకో వివరాలు వెల్లడించారు.

" భారత్​, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి హింస చెలరేగి, మరణాలు సంభవించినట్లు వచ్చిన నివేదికలతో ఆందోళన చెందాం. ఇరు వైపులా సంయమనం పాటించాలని కోరుతున్నాం. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నట్లు మాకు సానుకూల సమాచారం అందింది."

- ఎరి కనెకో, ఐరాస ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి.

భారత్​, చైనా సైనికుల మధ్య సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే.. ఈ ఘటనలో చైనా వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు భారత్​ వర్గాలు భావిస్తున్నాయి. ఆ సంఖ్య 43గా అంచనా వేశాయి.

ABOUT THE AUTHOR

...view details