తెలంగాణ

telangana

ETV Bharat / international

డొనాల్డ్​ ట్రంప్​కు కిమ్​ మరో 'ప్రేమలేఖ'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు మరోమారు లేఖ రాశారు ఉత్తరకొరియా నాయకుడు కిమ్​ జోంగ్​ ఉన్​. కొరియా నుంచి 'సానుకూల లేఖ' అందిందని వెల్లడించారు ట్రంప్​.  ఇరువురి మధ్య మరో సమావేశం ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

By

Published : Aug 10, 2019, 10:04 AM IST

Updated : Aug 10, 2019, 10:19 AM IST

డొనాల్డ్ ట్రంప్కు కిమ్ మరో 'ప్రేమలేఖ'

ఉత్తర కొరియా నాయకుడు కిమ్​ జోంగ్​ ఉన్​ నుంచి సానుకూల లేఖ అందిందని వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అందులోని అంశాలను బహిర్గతం చేయలేదు.

డొనాల్డ్​ ట్రంప్

"మా మధ్య మరో సమావేశం ఉంటుందని అనుకుంటున్నా. ఆయన మూడు పేజీల అందమైన లేఖ రాశారు. అది ఆద్యంతం అందమైన లేఖ. అందులోని అంశాలను త్వరలోనే వెల్లడిస్తాను. కానీ అది మంచి సానుకూల లేఖ."
-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ఇటీవల దక్షిణ కొరియా-అమెరికాకు హెచ్చరికగా ఉత్తర కొరియా క్షిపణ పరీక్షలు చేపట్టినా... కిమ్​ను వెనకేసుకొచ్చారు ట్రంప్. క్షిపణి పరీక్షలపై కిమ్​ సంతోషంగా లేరని చెప్పారు​. ఇప్పటి వరకు పరీక్షించిన క్షిపణులు చాలా చిన్నవన్నారు​ ట్రంప్​.

ఈసారైనా...

గత వేసవి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ట్రంప్​, కిమ్​ మూడుసార్లు భేటీ అయ్యారు. ప్రతి సమావేశంలోనూ కొరియాలో అణ్వాయుధ పరీక్షల నిలిపివేతపై ప్రధానంగా చర్చించారు. కానీ పూర్తిస్థాయిలో చర్చలు సఫలం కాలేదు. ఇటీవలే దక్షిణ కొరియాలో సైనిక విన్యాసాలకు నిరసనగా మరోమారు క్షిపణి పరీక్షలు చేపట్టింది ఉత్తరకొరియా.

ఇదీ చూడండి: భారత్ యుద్ధవాతావరణం సృష్టిస్తోంది: ఇమ్రాన్​

Last Updated : Aug 10, 2019, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details