తెలంగాణ

telangana

ETV Bharat / international

'డ్రోన్​ కూల్చివేత ఇరాన్​ చేసిన అతిపెద్ద తప్పు' - president

నిఘా డ్రోన్​ కూల్చివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా డ్రోన్​ను కూల్చి ఇరాన్​ పెద్ద తప్పే చేసిందని వ్యాఖ్యానించారు. ఇరాన్​పై ట్రంప్​ వ్యాఖ్యలతో చమురు ధరలు సుమారు 6 శాతం మేర పెరిగాయి.

'డ్రోన్​ కూల్చివేత ఇరాన్​ చేసిన అతిపెద్ద తప్పు'

By

Published : Jun 21, 2019, 5:52 AM IST

తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చివేయడంపై అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ మండిపడ్డారు. డ్రోన్‌ను కూల్చి ఇరాన్‌ పెద్ద తప్పు చేసిందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ట్రంప్​నకు వెల్లడించినట్టు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి సారా​ సాండర్స్​ తెలిపారు. ఈ విషయమై చట్ట సభ్యులతో కూడా చర్చించామన్నారు.

అమెరికాకు చెందిన ఆర్‌క్యూ-4 గ్లోబల్ హాక్‌ నిఘా డ్రోన్‌ గురువారం ఉదయం హోర్మోజ్‌గాన్‌ ప్రావిన్స్ సమీపంలో ఇరాన్‌ గగనతలంలోకి ప్రవేశించింది. రివల్యూషనరీ గార్డ్‌ సిబ్బంది ఆ డ్రోన్‌ను కూల్చేశారని ఇరాన్‌ అధికారిక టీవీ ఛానల్‌ పేర్కొంది. ఈ వార్తలను అమెరికా కూడా ధ్రువీకరించింది.

చమురు ధరలకు రెక్కలు

ఇరాన్​పై​ ట్రంప్​ ఆగ్రహంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు సుమారు 6 శాతానికి పైగా పెరిగాయి. యూరప్​ బ్రెంట్​ ముడి చమురు ధర సుమారుగా 5 శాతం మేర పెరిగింది. ముడి చమురు సరఫరా చేసే ప్రధాన జలసంధి హొర్మూజ్​ వద్ద డ్రోన్​ కూల్చటం వల్ల సరఫరాపై ప్రభావం పడుతుందని ప్రపంచ మార్కెట్లలో భయాలుపట్టుకున్నాయి.

ఇదీ చూడండి:అమెరికా నిఘా డ్రోన్​ను కూల్చేశాం: ఇరాన్​

ABOUT THE AUTHOR

...view details