జీ7 శిఖరాగ్ర దేశాల సదస్సు నిర్వహణ వేదికపై స్పష్టతనిచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తన అధికారిక క్యాంప్ డేవిడ్ రెసిడెన్సీలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలుత ట్రంప్కు చెందిన గోల్ఫ్ రిసార్ట్లో జీ7 సదస్సు నిర్వహించాలని భావించినా.. సర్వత్రా విమర్శలు ఎదురవడం వల్ల ఆ వేదికను మార్చారు అమెరికా అధ్యక్షుడు.
లండన్లో జరుగుతున్న నాటో సదస్సులో భాగంగా జీ7 నాయకులు, కెనడా ప్రధాన మంత్రి జుస్టిసన్ ట్రుడీయూతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు ట్రంప్.