లాక్డౌన్ సడలింపుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలలను పునఃప్రారంభించేందుకు కృషి చేయాలని రాష్ట్రాల గవర్నర్లకు ఆదేశాలు ఇచ్చారు.
అమెరికా అలర్జీ, అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ సూచనలకు విరుద్ధంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాలో లాక్డౌన్ ఎత్తివేతపై ఫౌచీ తాజాగా చేసిన వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని విమర్శించారు.
"నాకు తెలిసి పాఠశాలలను తప్పనిసరిగా తెరవాలి. దేశం వీలైనంత త్వరగా పూర్వస్థితికి రావాలి. పాఠశాలలు తెరుచుకోకపోతే ఇది సాధ్యం కాదు. దేశంలో ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు (ఆంథోనీ ఫౌచీ) అలసిపోయారు.
ఆయన యువతపై కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉందని చెప్పారు. పాఠశాలల విషయంలో ఆయనతో నేను ఏకీభవించటం లేదు. ఆయన చెప్పినవి నాకు ఆమోదయోగ్యం కావు."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు