తెలంగాణ

telangana

By

Published : Nov 15, 2020, 10:33 PM IST

ETV Bharat / international

బైడెన్​ గెలుపును అంగీకరించిన ట్రంప్​.. కానీ!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసిన రెండు వారాల తర్వాత తొలిసారి బహిరంగంగా జో బైడెన్​ విజయాన్ని అంగీకరించారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. కానీ, ఎన్నికల్లో రిగ్గింగ్​ జరిగిందని మరోమారు ఆరోపించారు.

donald tump
అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ఎన్నికల ఓటమిని అంగీకరించినట్టు కనిపిస్తోంది​. ఎన్నికలు ముగిసిన రెండు వారాల తర్వాత తొలిసారి డెమొక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్​ విజయం సాధించారని బహిరంగంగా పేర్కొన్నారు ట్రంప్​. అయితే.. ఎన్నికల్లో రిగ్గింగ్​ జరిగిందని ఆరోపిస్తూ తన పోరాటాన్ని ఆపనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎన్నికలపై ట్వీట్​ చేశారు ట్రంప్​.

"ఎన్నికల్లో రిగ్గింగ్​ జరగటం వల్లే బైడెన్​ గెలిచారు. ఓట్ల పరిశీలకులను అనుమతించలేదు. రాడికల్​ లెఫ్ట్​ ప్రైవేటు యాజమాన్య సంస్థ ఓట్లను లెక్కించింది. దానికి చడ్డ పేరు ఉంది. పరికరాలు కూడా సరిగ్గా లేవు. దుష్ప్రచారాలు జరిగాయి. వీటిపైపై మీడియా మౌనంగా ఉంది!"

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి 46వ అధ్యక్షుడిగా అధికారం చేపట్టనున్నారు జో బైడెన్​. పెన్సిల్వేనియాలో గెలిచి 270 మార్క్​ను దాటిన క్రమంలో ఆయన విజయం ఖరారైంది. బైడెన్​కు 300లకుపైగా ఎలక్టోరల్​ ఓట్లు వచ్చాయి. అయితే.. తన ఓటమిని అంగీకరించేందుకు నిరాకరించారు ట్రంప్​. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ న్యాయపోరాటానికి దిగారు.

ఇదీ చూడండి:ట్రంప్​కు మద్దతుగా అమెరికాలో భారీ ర్యాలీలు

ABOUT THE AUTHOR

...view details