తెలంగాణ

telangana

కూలిన మెట్రో రైలు- 15 మంది మృతి

By

Published : May 4, 2021, 10:50 AM IST

Updated : May 4, 2021, 11:57 AM IST

Metro Rail Accident
మెట్రో రైలు ప్రమాదం

10:45 May 04

కూలిన మెట్రో రైలు- 15 మంది మృతి

మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. మెట్రో వంతెన పైనుంచి రైలు కిందపడి 15 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 70 మందికి గాయాలయ్యాయి.  

మెక్సికో నగరంలోని 12వ మెట్రో లైన్​లో సోమవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో.. ఉన్నట్టుండి రైలు వంతెన కుప్పకూలింది. అదే సమయంలో దానిపై ప్రయాణిస్తున్న మెట్రో రైలు.. రహదారిపైనున్న వాహనాలపై పడింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న 15 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ విషాద ఘటనపై ఆ దేశ విదేశాంగ మంత్రి మార్సెలో విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:బస్సు ప్రమాదం-11 మంది మృతి

Last Updated : May 4, 2021, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details