తెలంగాణ

telangana

ETV Bharat / international

మార్స్​పైకి వెళ్లాలా? ఆన్​లైన్​లో అప్లై చేసుకోండిలా... - వ్యోమగాములను నియమించుకోవాలని నాసా నిర్ణయించింది

అమెరికాకు చెందిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్​ఎస్​)లో భవిష్యత్​లో​ అవసరమయ్యే వ్యోమగాములను నియమించుకోవాలని నాసా నిర్ణయించింది. ఇందుకోసం అమెరికా పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. 2030లో చంద్రుడు, అంగారక గ్రహంపైకి ఎక్కువ సంఖ్యలో వ్యోమగాములను పంపనుంది నాసా. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బృందంలో కొత్తగా నియామకం కానున్న వారిని చేర్చనుంది.

Space explorers wanted: NASA seeks next generation of astronauts
'మార్స్​పైకి వెళ్లేందుకు వ్యోమగాములు కావలెను'

By

Published : Feb 12, 2020, 3:53 PM IST

Updated : Mar 1, 2020, 2:29 AM IST

భవిష్యత్తు అంతరిక్షపరిశోధనలకు అనుగుణంగా వ్యోమగాముల సంఖ్యను పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు నాసా ప్రకటించింది. అమెరికా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్​ఎస్​)లో ప్రస్తుతం 48 మంది ఉండగా.. ఆ సంఖ్యను మరింత పెంచుకోనున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ పేర్కొంది.

20వ వార్షికోత్సవం..

ఈ ఏడాది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్​ఎస్​) 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో అంతరిక్ష కార్యకలాపాలను మరింత విస్తృత పర్చాలని నిర్ణయించిన నాసా దరఖాస్తులను ఆహ్వానించింది. 2024 నాటికి రెండు విడతల్లో ఓ మహిళ, ఓ పురుషుడిని చంద్రుడిపైకి పంపనున్నట్లు నాసా ఉన్నతాధికారి జిమ్ బ్రిడెన్‌స్టెయిన్​ ప్రకటించారు.

"అత్యంత ప్రతిభావంతులైన మహిళలు, పురుషులను వ్యోమగామి దళంలో చేరడానికి ఆహ్వానిస్తున్నాం. అర్హత గల అమెరికన్ల నుంచి దరఖాస్తులను కోరుతున్నాం. మార్చి 2 నుంచి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్​లైన్​ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి రెండేళ్ల పాటు అవసమైన శిక్షణ ఉంటుంది."-నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టెయిన్​

2030లో చంద్రుడు, అంగారకుడిపై విస్తృతమైన పరిశోధనలు చేయడానికి ఎక్కువ సంఖ్యలో వ్యోమగాములను తమ సొంత రాకెట్లు ద్వారా అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించింది నాసా. అప్పుడు పంపే వ్యోమగాముల బృందంలో నూతనంగా ఎంపికయ్యే వారిని చేర్చనున్నారు.

Last Updated : Mar 1, 2020, 2:29 AM IST

ABOUT THE AUTHOR

...view details