అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మృత్యు మృదంగం మోగిస్తోంది. వైరస్ దెబ్బకు ఆ దేశంలో ఇప్పటికే 23,000 మందికి పైగా మరణించారు. అయితే- ఇది అధికారిక లెక్క మాత్రమేనని.. వాస్తవ మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు విశ్లేషకులు. అమెరికా వ్యాప్తంగా నర్సింగ్ హోంలు, దీర్ఘకాలిక చికిత్సా కేంద్రాల్లో కరోనా సోకి ఇప్పటివరకు 3,600 మందికి పైగా మరణించారని వారు చెప్పారు. ఈ మృతుల సంఖ్యను అధికారిక గణాంకాల్లో అధికారులు కలిపి చూపించడం లేదని తెలిపారు. తాజాగా అధికార వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించడం కలకలం సృష్టిస్తోంది.
నర్సింగ్హోంల్లో మృతులు..
రెండు వారాల క్రితం వరకు అమెరికాలోని నర్సింగ్ హోంలు, దీర్ఘకాలిక చికిత్సా కేంద్రాల్లో కరోనా దెబ్బకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 450గా ఉంది. ప్రస్తుతం అది 3,621కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఈ కేంద్రాల్లో 10 లక్షల మందికిపైగా ఉంటున్నట్లు అంచనా. వారిలో ఎక్కువమంది వృద్ధులే. వైద్య సిబ్బంది కొరత, పర్యవేక్షణ లేమి వంటివి ఈ కేంద్రాల్లో వైరస్ వ్యాప్తికి ఊతమిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పరీక్షలకు డిమాండ్