తెలంగాణ

telangana

ETV Bharat / international

'కశ్మీర్​ అంశాన్ని ఐరాసలో ఇప్పట్లో చర్చించబోం' - 'కశ్మీర్​ అంశాన్ని ఐరాసలో ఇప్పట్లో చర్చించబోం'

కశ్మీర్​ అంశంలో పాకిస్థాన్​కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెలలో జరగనున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ) సమావేశాల్లో ఈ అంశంపై చర్చలు జరపబోమని స్పష్టం చేశారు ఐరాసలో బ్రిటన్​ శాశ్వత ప్రతినిధి. ఈ నెల సమావేశాలకు ఆయనే అధ్యక్షత వహించనున్నారు. ప్రస్తుతం చర్చించటానికి ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వెల్లడించారు.

'కశ్మీర్​ అంశాన్ని ఐరాసలో ఇప్పట్లో చర్చించబోం'

By

Published : Nov 2, 2019, 3:06 PM IST

Updated : Nov 2, 2019, 8:11 PM IST

ఈ నెలలో కశ్మీర్​ విషయాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ)లో చర్చించేది లేదని స్పష్టం చేశారు ఐరాసలో బ్రిటన్​ శాశ్వత ప్రతినిధి కరెన్​ పియర్స్​. ఈ నవంబర్​లో జరిగే మండలి సమావేశాలకు ఆయనే అధ్యక్షత వహించనున్నారు. ప్రస్తుతం చర్చించటానికి ప్రపంచంలో ఎన్నో సమస్యలున్నాయని ఆయన పేర్కొన్నారు. మండలిలో చర్చించే అంశాల జాబితాలో ప్రస్తుతం 'కశ్మీర్ సమస్య' లేదన్నారు.

ప్రతి నెలా భద్రతా మండలిలో చర్చించటానికి షెడ్యూల్​లో లేని కొత్త విషయాలను సభ్యులు ఎంచుకుంటారు. కానీ ఈసారి మండలి సభ్యులు కశ్మీర్​ అంశాన్ని ఎంచుకోలేదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు పియర్స్​.

చైనా, పాకిస్థాన్​ దేశాలు కశ్మీర్​ అంశాన్ని చర్చించాలని భద్రతా మండలిని కోరిన తర్వాత ఆగస్టు నెలలో కశ్మీర్​ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అంశాన్ని చర్చించినట్లు స్పష్టం చేశారు.

జమ్ముకశ్మీర్​లో అధికరణ 370 రద్దు అనంతరం భారత్​, పాక్​ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాయాది దేశం..​ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని ప్రయత్నించింది. అయితే.. ఇది ముమ్మాటికీ తమ అంతర్గత విషయమేనని భారత్​ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:దిల్లీలో కాలుష్య తీవ్రత కాస్త తగ్గుముఖం.. కానీ..!

Last Updated : Nov 2, 2019, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details