తెలంగాణ

telangana

ETV Bharat / international

హింసాత్మకంగా మారిన నిరసనలు.. ఏడుగురు మృతి - protests in Colombia capital of Bogota

కొలంబియాలో పోలీసుల కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి మృతికి నిరసనగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురు పౌరులు మరణించారు.

Protests in Colombia over death in police custody
హింసాత్మకంగా మారిన నిరసనలు.. ఏడుగురు మృతి

By

Published : Sep 11, 2020, 11:51 AM IST

కొలంబియా రాజధాని బొగోటాలో నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసుల కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి మృతికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారి... పౌరులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు మృతి చెందారు.

నిరసన జ్వాలలతో అట్టుడుకుతున్న కొలంబియా
ఆందోళనల్లో పాల్గొన్న యువత

పోలీసుల అమానుష ప్రవర్తన కారణంగా 43 ఏళ్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దీంతో ఆయన మృతికి సంఘీభావంగా నిరసనలు చెలరేగాయి.

పోలీస్​స్టేషన్​కు నిప్పు అంటిస్తున్న దృశ్యం
పూర్తిగా దహనమైన సిటీ బస్సు
పోలీసులపై రాయి విసురుతున్న ఆందోళనకారుడు

పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయిన పౌరులు... 8 సిటీ బస్సులను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు విసిరారు. స్టేషన్లపై దాడి చేశారు. ఈ ఘటనలో 175 మంది పౌరులు గాయపడ్డారు. నిరసనల్లో పాల్గొన్నవారిలో ఎక్కువమంది యువత కావడం గమనార్హం. నిరసకారులను చెదరగొట్టడానికి బాష్పవాయువు, రబ్బరు బల్లెట్లు ఉపయోగించారు పోలీసులు.

పోలీసు స్టేషన్​పై దాడి చేస్తున్న నిరసనకారులు
హింసాత్మకంగా మారిన నిరసనలు.. ఏడుగురు మృతి

ఇదీ చూడండి:'ఉగ్రమూకలపై పాక్​ కఠిన చర్యలు తీసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details