తెలంగాణ

telangana

ETV Bharat / international

హింసాత్మకంగా మారిన నిరసనలు.. ఏడుగురు మృతి

కొలంబియాలో పోలీసుల కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి మృతికి నిరసనగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురు పౌరులు మరణించారు.

By

Published : Sep 11, 2020, 11:51 AM IST

Protests in Colombia over death in police custody
హింసాత్మకంగా మారిన నిరసనలు.. ఏడుగురు మృతి

కొలంబియా రాజధాని బొగోటాలో నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసుల కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి మృతికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారి... పౌరులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు మృతి చెందారు.

నిరసన జ్వాలలతో అట్టుడుకుతున్న కొలంబియా
ఆందోళనల్లో పాల్గొన్న యువత

పోలీసుల అమానుష ప్రవర్తన కారణంగా 43 ఏళ్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దీంతో ఆయన మృతికి సంఘీభావంగా నిరసనలు చెలరేగాయి.

పోలీస్​స్టేషన్​కు నిప్పు అంటిస్తున్న దృశ్యం
పూర్తిగా దహనమైన సిటీ బస్సు
పోలీసులపై రాయి విసురుతున్న ఆందోళనకారుడు

పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయిన పౌరులు... 8 సిటీ బస్సులను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు విసిరారు. స్టేషన్లపై దాడి చేశారు. ఈ ఘటనలో 175 మంది పౌరులు గాయపడ్డారు. నిరసనల్లో పాల్గొన్నవారిలో ఎక్కువమంది యువత కావడం గమనార్హం. నిరసకారులను చెదరగొట్టడానికి బాష్పవాయువు, రబ్బరు బల్లెట్లు ఉపయోగించారు పోలీసులు.

పోలీసు స్టేషన్​పై దాడి చేస్తున్న నిరసనకారులు
హింసాత్మకంగా మారిన నిరసనలు.. ఏడుగురు మృతి

ఇదీ చూడండి:'ఉగ్రమూకలపై పాక్​ కఠిన చర్యలు తీసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details