కొలంబియా రాజధాని బొగోటాలో నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసుల కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి మృతికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారి... పౌరులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు మృతి చెందారు.
నిరసన జ్వాలలతో అట్టుడుకుతున్న కొలంబియా ఆందోళనల్లో పాల్గొన్న యువత పోలీసుల అమానుష ప్రవర్తన కారణంగా 43 ఏళ్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దీంతో ఆయన మృతికి సంఘీభావంగా నిరసనలు చెలరేగాయి.
పోలీస్స్టేషన్కు నిప్పు అంటిస్తున్న దృశ్యం పూర్తిగా దహనమైన సిటీ బస్సు పోలీసులపై రాయి విసురుతున్న ఆందోళనకారుడు పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయిన పౌరులు... 8 సిటీ బస్సులను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు విసిరారు. స్టేషన్లపై దాడి చేశారు. ఈ ఘటనలో 175 మంది పౌరులు గాయపడ్డారు. నిరసనల్లో పాల్గొన్నవారిలో ఎక్కువమంది యువత కావడం గమనార్హం. నిరసకారులను చెదరగొట్టడానికి బాష్పవాయువు, రబ్బరు బల్లెట్లు ఉపయోగించారు పోలీసులు.
పోలీసు స్టేషన్పై దాడి చేస్తున్న నిరసనకారులు హింసాత్మకంగా మారిన నిరసనలు.. ఏడుగురు మృతి ఇదీ చూడండి:'ఉగ్రమూకలపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలి'